MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైద‌రాబాదీల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. ఔట‌ర్‌ రింగ్ రోడ్ చుట్టూ ఆర్టీసీ బ‌స్సులు

హైద‌రాబాదీల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. ఔట‌ర్‌ రింగ్ రోడ్ చుట్టూ ఆర్టీసీ బ‌స్సులు

Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న జనాభాతో పాటు కొత్త కాలనీలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్య పెంచే దిశగా చర్యలు చేపడుతున్నారు. త్వ‌ర‌లోనే బ‌స్సులు అందుబాటులోకి రానున్నాయి. 

1 Min read
Narender Vaitla
Published : Nov 15 2025, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓఆర్ఆర్ పరిసరాల్లో పెరిగిన పబ్లిక్ డిమాండ్
Image Credit : Generated by google gemini AI

ఓఆర్ఆర్ పరిసరాల్లో పెరిగిన పబ్లిక్ డిమాండ్

ఔటర్ సమీప ప్రాంతాల్లో నివాసాలు పెరగడంతో బస్సుల అవసరం ఎక్కువైంది. అయితే లాభాలు వ‌చ్చే మార్గాల‌కు మాత్ర‌మే ఆర్టీసీ అధికారులు ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, త‌మ‌ను ప‌ట్టించుకోవడం లేదంటూ కొంద‌రు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అధికారులు ఇప్పటికే విస్తృత అధ్యయనం పూర్తి చేశారు.

25
శంషాబాద్–గచ్చిబౌలి మార్గంలో
Image Credit : @r/hyderabad/reddit

శంషాబాద్–గచ్చిబౌలి మార్గంలో

ప్రస్తుతం శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు 315 నంబర్ బస్సు నడుస్తోంది. ఐటీ ఉద్యోగులు, చిన్న దుకాణదారులు, స్థానిక ప్రజల నుంచి ఈ రూట్‌కు మంచి స్పందన వచ్చింది. ఇదే విధంగా ఇతర మార్గాల్లో కూడా బస్సులు నడిపితే ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Related Articles

Related image1
ఏపీలో ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం.. రూ. 1201 కోట్లతో భారీ సంస్థ, శంకుస్థాప‌న
Related image2
ఎన్ని క‌ష్టాలొచ్చినా ఓపిక ఉంటే చాలు.. ఈ క‌థ చ‌దివితే మీ క‌ళ్లు తెరుచుకోవ‌డం ఖాయం
35
25 ఎగ్జిట్ పాయింట్లకు బస్సు అనుసంధానం
Image Credit : our own

25 ఎగ్జిట్ పాయింట్లకు బస్సు అనుసంధానం

158 కిలోమీటర్ల పొడవున్న ఓఆర్ఆర్ పై 25 ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. నానక్‌రామ్ గూడ నుంచి పెద్ద అంబర్‌పేట, శామీర్‌పేట నుంచి దుండిగల్ వరకు ఈ పాయింట్లు విస్తరించి ఉన్నాయి. ప్రతి ఎగ్జిట్ నుంచి 20–25 కిలోమీటర్ల దూరంలో పెద్ద సంఖ్యలో కాలనీలు ఉన్నందున బస్సులు అనుసంధానం చేస్తే ప్రయాణికులకు సౌక‌ర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

45
ట్రాఫిక్ తగ్గించడానికి
Image Credit : Asianet News

ట్రాఫిక్ తగ్గించడానికి

ప్రైవేట్ వాహనాలు తగ్గితే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ఓఆర్ఆర్ సేవలపై బస్సులు నడిస్తే పరిసర ప్రాంతాలకు 20–30 నిమిషాల్లో చేరవచ్చని అధికారులు చెబుతున్నారు. బస్సుల సంఖ్య పెరిగితే ఆధ్యాత్మిక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

55
మ‌రిన్ని ఎల‌క్ట్రిక్ బస్సులు
Image Credit : X/@ram_views

మ‌రిన్ని ఎల‌క్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 2800 బస్సులు నడుస్తున్నాయి. వాటిలో 450 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. త్వరలో కొత్త ఈ-బస్సులను కూడా ప్రవేశపెట్టడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ బస్సులను ఓఆర్ఆర్ ప్రాంతాల్లో నడపాలని స్థానికులు బలంగా కోరుతున్నారు. అధికారులు ఈ ప్రతిపాదనపై త్వరలో నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
హైదరాబాద్
తెలంగాణ
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved