MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్

అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్

తెలంగాణ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  ఫోకస్ పెట్టింది. ఈ దిశగా  కార్యాచరణను మరింత ముమ్మరం చేసింది.

2 Min read
narsimha lode
Published : Aug 03 2023, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్

అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి  జరగనున్న ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది.ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ముందుగానే  ప్రకటించాలని  కాంగ్రెస్ పార్టీ  భావిస్తుంది.  తెలంగాణ రాష్ట్రంలో  అభ్యర్థుల ఎంపిక కోసం  ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకముందే  అభ్యర్థులను  ప్రకటించాలని  భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ పార్టీ నాయకత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. 
 

26
అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్

అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్

కర్ణాటక  ఫార్మూలాను కూడ  తెలంగాణలో అమలు  చేయాలని  ఆ పార్టీ భావిస్తుంది.  కాంగ్రెస్ నేతల  మధ్య  సమన్వయంతో పాటు సర్వేల ద్వారా అభ్యర్థుల ఎంపికపై  ఆ పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. గెలుపు గుర్రాలనే అభ్యర్ధులుగా ప్రకటించనున్నారు.ఈ మేరకు  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్రంలోని  అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహిస్తుంది. సర్వే ఆధారంగా  టిక్కెట్లను కేటాయించనున్నారు

36
అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్

అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు  అభ్యర్థుల ఎంపిక  కోసం కాంగ్రెస్ పార్టీ  స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు  చేసింది.  కేరళకు చెందిన ఎంపీ మురళీధరన్ చైర్మెన్ గాకమిటీని నియమించింది.  బాబా సిద్దిఖ్, జిగ్నేష్ మేవానీలకు ఈ కమిటీలో  స్థానం కల్పించింది.  ఈ కమిటీలో ఎక్స్ అఫిషియో  సభ్యులుగా   మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను నియమించింది. అయితే  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  మాత్రం అవకాశం దక్కలేదు. 

46
అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్

అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  రెండు దఫాలు  ఆ పార్టీ  అధికారానికి దూరంగా ఉంది.  వచ్చే దఫా అధికారాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది.దరిమిలా  ఈ దఫా ఎన్నికలను  కాంగ్రెస్ నాయకత్వం  సీరియస్ గా తీసుకుంది

56
అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్

అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్


కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం  ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపింది.ఈ జోష్ ను కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ దిశగానే కాంగ్రెస్ నాయకత్వం వ్యూహలను సిద్దం  చేస్తుంది. ఈ క్రమంలోనే  అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు  చేసింది.

66

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని బీఆర్ఎస్ లోని అసంతృప్తులతో పాటు  ఇతర పార్టీల్లోని  కీలక నేతలకు  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  గాలం వేస్తుంది. ఈ మేరకు ఎన్నికల వ్యూహకర్త సూచనల మేరకు  పార్టీలో చేరికలపై  ఆ పార్టీ నాయకత్వం  నిర్ణయం తీసుకుంటుంది.రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిపై  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫోకస్ పెట్టారు. తెలంగాణపై  కూడ  సోనియాగాంధీ  కేంద్రీకరించారు. ఇటీవల జరిగిన ఖమ్మం  సభ జరిగిన తీరుతెన్నులను  కూడ  ఆమె  ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
 

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved