Revanth Reddy: ఆ మాటలు వింటే రక్తం మరుగుతోంది.. ట్రోలింగ్పై రేవంత్ ఫైర్.
Revanth Reddy Fires on KCR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మాట్లాడిన రేవంత్ పలు అంశాలపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ హక్కులను కేసీఆర్ తాకట్టు పెట్టారంటూ ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
- FB
- TW
- Linkdin
Follow Us
)
CM Revanth Reddy
ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే సభకు వచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. గత ఏడాది డిసెంబర్ 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు కేసీఆర్కు రూ. 57.84 లక్షల జీతం ఇచ్చామని అన్నారు. 15 నెలల్లో ఇంత ప్రభుత్వ సొమ్మును కేసీఆర్ తీసుకున్నారని ఎద్దేవ చేశారు. అయితే కేసీఆర్ మాత్రం ప్రభుత్వం నుంచి జీతం తీసుకొని ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని, తెలంగాణ హక్కులను కేసీఆర్ (KCR) తాకట్టు పెట్టారని విమర్శించారు.
రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడిన వ్యవస్థలను కేసీఆర్ నిర్వీర్యం చేశారన్న రేవంత్.. బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించారన్నారు. గతంలో బలహీన వర్గాలకు చెందిన ఓ మహిళా గవర్నర్ ను అవమాన పరిచే విధంగా కేసీఆర్ ప్రవర్తించాన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు ఏ ఒక్కరి వ్యక్తుల సొంతం కాదన్నారు.
నాగార్జునసాగర్ పైకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వస్తే ఆ సమయంలో కేసీఆర్ ఏం చేశారని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతలు ఇలానే మాట్లాడేది అంటూ ధ్వజమొత్తారు.
Revanth Reddy
వాళ్లు మాట్లాడే భాష చూస్తే రక్తం మరుగుతోంది: Revanth Reddy
ఇక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై ఇష్టానుసారంగా పోస్టులు చేస్తున్న అంశంపై కూడా రేవంత్ ఓపెన్ అయ్యారు. భూభారతిని తీసుకొచ్చి పేదల భూములను పేదలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నందుకు తనపై కోపం పెంచుకుంటున్నారా? అని ప్రశించారు. తనపై అక్కసు వెళ్లగక్కాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎం ప్రశ్నించారు. ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడితే గౌరవిస్తామని, అలాకాకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని జర్నలిస్టులను ఉద్దేశిస్తూ రేవంత్ హెచ్చరించారు.
ఎవరు పడితే వాళ్లు ట్యూబ్ పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే వాళ్లు జర్నలిస్టులు అవుతారా? అంటూ ప్రశ్నించారు. కొందరు మాట్లాడే బాష చూస్తే రక్తం మరిగిపోతోందన్న రేవంత్.. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నామన్నారు. కుటుంబసభ్యులను అంతేసి మాటలు అంటుంటే.. అసలు మీరు మనుషులేనా? మీకు భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో.. చెల్లినో.. భార్యనో.. ఈ రకంగా మాట్లాడితే నువ్వు వింటావా? అంటూ రేవంత్ సభా సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు.
Revanth Reddy
ఇక మీడియా సంఘాల నాయకులు జర్నలిస్టుల జాబితాను ఇవ్వాలని, ఆ లిస్టులో ఉన్న వాళ్ల తప్పు చేస్తే ఏ శిక్ష వేయాలో మీరే నిర్ణయించాలని స్పీకర్ను రేవంత్ కోరారు. ఆ జాబితాలో లేని వారు జర్నలిస్ట్ కారని, అలాంటి వాళ్లను క్రిమినల్స్ లాగే చూడాల్సి వస్తుందన్నారు. అలాంటి వారి ముసుగు ఊడదీసి, బట్టలు ఊడదీసి కొడతామని రేవంత్ హెచ్చరించారు. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.