సీఎం కేసీఆర్కు వరుస పెండ్లి పిలుపులు..!!
జహీరాబాద్ ఎంపీ బీ.బీ.పాటిల్ మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. తమ కుమార్తె వివాహానికి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
టీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా మంగళవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి, ఆశీర్వాదం తీసుకున్నారు
![article_image2](https://static-ai.asianetnews.com/images/01etqkqw66jq0a9nhjh9qzjh7k/977a5a59-0e0d-449a-a9f5-c1403eb2e8ce-jpg_300x196xt.jpg)
ఆదిలాబాద్ టీజీవోల అసోసియేషన్ కార్యదర్శి కె.వనజారెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిశారు. తమ కుమారుడి వివాహానికి రావాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
జహీరాబాద్ ఎంపీ బీ.బీ.పాటిల్ మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. తమ కుమార్తె వివాహానికి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ నాయకుడు, ఎంపీపీ మిట్టపల్లి సుదర్శన్ మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిశారు. తమ కుమారుడి వివాహానికి రావాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.