- Home
- Technology
- BSNL: ఎయిర్టెల్, జియోలకు షాక్.. BSNL నుంచి ఈ-సిమ్. అసలేంటీది.? దీని ఉపయోగాలు ఏంటి?
BSNL: ఎయిర్టెల్, జియోలకు షాక్.. BSNL నుంచి ఈ-సిమ్. అసలేంటీది.? దీని ఉపయోగాలు ఏంటి?
BSNL: ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ యూజర్లను ఆకర్షించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా టాటా కమ్యూనికేషన్స్తో జత కట్టింది. వివరాల్లోకి వెళితే..

టాటా కమ్యూనికేషన్స్, బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యం
టాటా కమ్యూనికేషన్స్, ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కలిసి దేశవ్యాప్తంగా eSIM సేవలను ప్రారంభించాయి. టాటా కమ్యూనికేషన్స్ "Move" ప్లాట్ఫారమ్ ఆధారంగా ఈ సేవ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా వినియోగదారులు ఫిజికల్ సిమ్ అవసరం లేకుండానే మొబైల్ కనెక్టివిటీని యాక్టివేట్ చేసుకోవచ్చు.
eSIM అంటే ఏంటి?
సాధారణంగా మనం ఉపయోగించే ఫిజికల్ సిమ్ కార్డు బదులు, ఫోన్లో ముందే అమర్చిన చిప్లో డిజిటల్ సిమ్ ప్రొఫైల్ను యాక్టివేట్ చేసుకోవడమే eSIM. అంటే ఫోన్లో సిమ్ కార్డ్ తీసి పెట్టాల్సిన అవసరం ఉండదు.
eSIM ఎలా పనిచేస్తుంది?
* మొబైల్ ఆపరేటర్ ఇచ్చిన QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా eSIM యాక్టివేట్ అవుతుంది.
* వినియోగదారు కాల్స్, డేటా లేదా రెండింటికీ వాడుకునేలా ఆప్షన్ ఉంటుంది.
* డ్యూయల్ సిమ్ ఫోన్లలో eSIM, ఫిజికల్ సిమ్ రెండూ ఒకేసారి వాడుకోవచ్చు.
* ఒకే ఫోన్లో అనేక నంబర్లను వాడుకునే సౌకర్యం ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ eSIM సేవల ప్రత్యేకతలు
* దేశవ్యాప్తంగా 2G/3G/4G నెట్వర్క్లకు రిమోట్ ప్రొవిజనింగ్ అందిస్తుంది.
* వినియోగదారులు QR కోడ్ స్కాన్ చేసి సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.
* టాటా కమ్యూనికేషన్స్ Move ప్లాట్ఫారమ్తో బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రిప్షన్ మేనేజ్మెంట్ సదుపాయం పొందుతుంది.
eSIM టెక్నాలజీ ప్రయోజనాలు
అంతర్జాతీయ కనెక్టివిటీ: విదేశాలకు వెళ్లినా సులభంగా లోకల్ ఆపరేటర్ సేవలు పొందవచ్చు.
కార్డు పోగొట్టుకునే భయం ఉండదు: ఫిజికల్ సిమ్ లేని కారణంగా దొంగతనం, డ్యామేజ్ సమస్యలు రావు.
ఒకే ఫోన్లో అనేక నంబర్లు: డ్యూయల్ సిమ్ లాగే, ఒకేసారి వేర్వేరు నంబర్లను వాడుకోవచ్చు.
సులభమైన యాక్టివేషన్: QR కోడ్ స్కాన్ చేస్తే చాలు, వెంటనే యాక్టివేట్ అవుతుంది.
విస్తరిస్తోన్న బీఎస్ఎన్ఎల్ సేవలు
* ఆగస్టులో తమిళనాడు సర్కిల్లో eSIM సేవలను ప్రారంభించింది.
* ఢిల్లీలో 4G నెట్వర్క్ను ప్రారంభించింది.
* ఇండియా పోస్టుతో ఒప్పందం కుదుర్చుకుని దేశవ్యాప్తంగా 1.65 లక్షల పోస్టాఫీసుల ద్వారా సిమ్ కార్డులు, రీచార్జ్ సేవలు అందిస్తోంది.
* ఇటీవల ప్రధానమంత్రి మోదీ ఒడిశాలో బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ను ప్రారంభించారు. సుమారు రూ. 37,000 కోట్లతో 97,500 కొత్త టవర్లు ఏర్పాటు చేశారు.