BSNL బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే 1 GB డేటా..! IPL చూసే వారికి పండగే!
BSNL అదిరిపోయే ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అందుబాటు ధరల్లో కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటిస్తూ.. ప్రైవేటు టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. తాజాగా ఒక రూపాయికే 1 GB డేటా ప్లాన్ ప్రకటించి ఓటీటీ, IPL లవర్స్ ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కొత్త రీఛార్జ్ ప్లాన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
BSNL వరుస ఆఫర్లతో కస్టమర్ల మనసు దోచేస్తోంది. గత కొన్ని నెలలుగా ప్రైవేటు టెలికాం సంస్థలు రీఛార్జ్ ఫ్లాన్స్ ధరలు భారీగా పెంచడంతో చాలామంది యూజర్లు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. నూతన ఉత్సాహంతో దూసుకుపోతున్న BSNL మరో కొత్త రీఛార్జ్ ప్లాన్ ని ప్రకటించింది. అదెంటో ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందో ఇక్కడ చూద్దాం.
IPL అభిమానులకు పండగే..
BSNL క్రికెట్ అభిమానులను అలరించడానికి ఒక స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ను పరిచయం చేసింది. IPL సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఎలాంటి ఖర్చు లేకుండా IPL మ్యాచ్లను లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు. ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రూ. 251 రీఛార్జ్ ప్లాన్..
రూ.251 ప్రీపెయిడ్ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 251GB హై స్పీడ్ డేటాను అందిస్తోంది. అంటే కేవలం ఒక రూపాయికి 1GB డేటాను పొందవచ్చు. రోజువారీ పరిమితి లేదు. ఈ ప్లాన్ డేటా ప్యాక్ మాత్రమే. ఇందులో అన్లిమిటెడ్ కాల్స్ లేదా SMS సేవలు అందుబాటులో లేవు. ఈ ప్లాన్ తక్కువ ధరలో హై స్పీడ్ డేటా కావాల్సిన యూజర్లకు బెస్ట్ ఎంపిక.
ఈ ఆఫర్ ఎవరికి బెస్ట్?
IPL సీజన్లో క్రికెట్ అభిమానుల కోసం స్పెషల్గా స్టార్ట్ చేసిన ఈ BSNL 251 రూపాయల ప్లాన్ చాలామందికి బాగా ఉపయోగపడుతుంది. ఆటంకం లేని మొబైల్ డేటా కావాల్సిన యూజర్లు ఈ ఆఫర్ను వాడుకోవచ్చు. మరీ ముఖ్యంగా OTT ప్లాట్ ఫామ్స్ ఎక్కువగా ఉపయోగించే వారికి, గేమింగ్ లవర్స్ కి ఈ ఆఫర్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది డేటా టెన్షన్ లేకుండా IPL మ్యాచ్లు చూడటానికి బెస్ట్ ఆప్షన్.
బీఎస్ఎన్ఎల్ విస్తృత సేవలు
రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో BSNL తన 4G నెట్వర్క్ను ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేస్తోంది. తద్వారా ఎక్కువమంది యూజర్లు తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లతో హై స్పీడ్ డేటాను పొందవచ్చు. 4G నెట్వర్క్ కవరేజ్ పెంచడానికి BSNL భారతదేశం అంతటా టవర్లు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు, 75,000 కంటే ఎక్కువ 4G టవర్లు ఏర్పాటుచేయగా.. త్వరలో వాటిని లక్ష టవర్లకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు.