MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ఖోఖో ప్ర‌పంచ క‌ప్ 2025: సౌతాఫ్రికా చిత్తు.. ఫైన‌ల్ కు చేరిన భార‌త మ‌హిళ జ‌ట్టు

ఖోఖో ప్ర‌పంచ క‌ప్ 2025: సౌతాఫ్రికా చిత్తు.. ఫైన‌ల్ కు చేరిన భార‌త మ‌హిళ జ‌ట్టు

Kho World Cup 2025: ఖోఖో ప్ర‌పంచ క‌ప్ 2025 లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు దుమ్మురేపుతోంది. సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట‌తో సౌతాఫ్రికాను చిత్తుచేసి ఫైన‌ల్ చేరుకుంది.  

2 Min read
Mahesh Rajamoni
Published : Jan 18 2025, 08:27 PM IST| Updated : Jan 18 2025, 08:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Kho Kho World Cup 2025: ఖోఖో ప్ర‌పంచ క‌ప్ 2025 లో భార‌త్ అద‌ర‌గొడుతోంది. అద్భుత‌మైన ఆట‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు షాకిస్తూ ఇప్ప‌టికు ఒక్క ఓట‌మి కూడా లేకుండా త‌న జైత్ర యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. పురుషుల జ‌ట్టుతో పాటు మ‌హిళ‌ల జ‌ట్టు అద్భుత‌మైన ఆట‌తో అద‌ర‌గొడుతోంది. తొలి ఖోఖో ప్ర‌పంచ క‌ప్ 2025లో మ‌హిళ జ‌ట్టు చ‌రిత్ర సృష్టిస్తూ ఒక్క ఓట‌మి లేకుండా ఫైన‌ల్ కు చేరుకుంది. 

 

24

శ‌నివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఖో ఖో ప్రపంచ కప్ 2025లో మ‌హిళ‌ల భారత మ‌హిళ‌ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో సౌతాఫ్రికాను చిత్తుచేసింది.

చ‌రిత్ర సృష్టించిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు 

ఖో ఖో ప్ర‌పంచ క‌ప్ 2025 లో ప్రియాంక ఇంగ్లే నేతృత్వంలోని భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు అద్భుత‌మైన ఆట‌తో అద‌ర‌గొడుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ టోర్నీలో ఒక్క ఓట‌మి లేకుండా భార‌త జ‌ట్టు లీగ్ ద‌శ‌ను పూర్తి చేసింది. ఆ త‌ర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భార‌త మ‌హిళ జ‌ట్టు సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. ఈ విజ‌యంతో టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు సెమీఫైనల్‌కు తమ స్థానాన్ని బుక్ చేసుకుంది.

34
Image Credits: Twitter/All India Radio News

Image Credits: Twitter/All India Radio News

శ‌నివారం సౌతాఫ్రికాతో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో మ‌న ప్లేయ‌ర్లు అద‌ర‌గొట్టారు. తొలి నుంచి అధిప‌త్యం ప్ర‌ద‌ర్శించారు. ఏ స‌మ‌యంలోనూ సౌతాఫ్రికాకు ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఆరంభం నుంచే సౌతాఫ్రికా జట్టుకు భారత మహిళలు చెమటలు పట్టించారు. 

44

సౌతాఫ్రికాతో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో భారత్ 50 పాయింట్ల తేడాతో గెలిచింది. సౌతాఫ్రికా తమ రెండు టర్న్ లలో కలిపి 16 పాయింట్లు సాధించగా, భారత మహిళలు 66 పాయింట్లు సాధించారు. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన నిర్మాల భాటీ బెస్ట్ డిఫెండ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును,  వైష్ణ‌వి భ‌జ‌రంగ్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు.  ఈ విజయంతో భారత జట్టు  ఫైనల్ లో నేపాల్ తో తలపడనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved