IPL 2026: ఐపీఎల్లో కొత్త రూల్.. ఇదే జరిగితే ఇక ఫైన్తో పాటు నిషేధం కూడా..
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ కోసం బీసీసీఐ రెండు కీలకమైన కొత్త నిబంధనలను ప్రకటించింది. మ్యాచ్ ప్రజెంటేషన్ సమయంలో డ్రెస్ కోడ్ పాటించని ఆటగాళ్లపై భారీ జరిమానాలతో పాటు మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఆటగాళ్ల క్రమశిక్షణ, మ్యాచ్ నిర్వహణకు సంబంధించి రెండు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ నియమాలను ఉల్లంఘించే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది.
మ్యాచ్ రోజు ప్రాక్టీస్పై పరిమితులు
కొత్త నిబంధనల ప్రకారం, మ్యాచ్ జరిగే రోజున పిచ్ సిద్ధం చేసిన తర్వాత ఏ జట్టు కూడా మైదానంలో ప్రాక్టీస్ చేయడానికి అనుమతి ఉండదు. మ్యాచ్కు ముందు గ్రౌండ్లో ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించకూడదని బీసీసీఐ స్పష్టం చేసింది.
ప్రజెంటేషన్ సెరిమనీలో డ్రెస్ కోడ్
మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆటగాళ్లు స్లీవ్లెస్ చొక్కాలు, నిక్కర్లు లేదా స్లిప్పర్లు వేసుకుని రావడంపై బీసీసీఐ నిషేధం విధించింది.
వేసవి తాపం కారణంగా..
వేసవి తాపం కారణంగా చాలా మంది ప్లేయర్లు మ్యాచ్ ముగిశాక తమ జెర్సీలను మార్చుకుని సౌకర్యవంతంగా ఉండే స్లీవ్లెస్ దుస్తుల్లో అవార్డుల కార్యక్రమానికి వస్తుంటారు. అయితే, ఇది క్రీడను, అతిథులను కించపరిచినట్లుగా భావించిన బీసీసీఐ, ఇకపై ఆటగాళ్లు ప్రాపర్ డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశించింది.
శిక్షలు, జరిమానాలు
ఈ నిబంధనలను ఉల్లంఘించే ఆటగాళ్లకు బిసిసిఐ కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
మొదటి సారి: ఆటగాడికి అధికారికంగా వార్నింగ్ ఇస్తారు.
రెండవ సారి: అదే తప్పు మళ్ళీ చేస్తే, సదరు ఆటగాడి మ్యాచ్ ఫీజులో భారీగా కోత విధిస్తారు.
పదే పదే ఉల్లంఘిస్తే: పెనాల్టీ మొత్తాన్ని రెట్టింపు చేయడమే కాకుండా, ఒక మ్యాచ్ పాటు నిషేధం విధించే అధికారం కూడా బీసీసీఐకి ఉంటుంది.
క్రికెట్ గౌరవాన్ని కాపాడటంతో పాటు, అవార్డులు ఇచ్చేందుకు వచ్చే ముఖ్య అతిథులకు తగిన గౌరవం ఇచ్చే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.

