MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • RCB : టాటా కాదు.. అంబానీ కాదు.. ఆర్సీబీని కొన్నది ఎవరు? IPL హిస్టరీలోనే భారీ డీల్

RCB : టాటా కాదు.. అంబానీ కాదు.. ఆర్సీబీని కొన్నది ఎవరు? IPL హిస్టరీలోనే భారీ డీల్

RCB New Owner : ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం రూ. 16,706 కోట్లకు కొనుగోలు చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 24 2026, 11:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
RCB : ఆర్సీబీ కొత్త బాస్ వచ్చేశాడు.. IPL 2026 ముందే అదిరిపోయే న్యూస్
Image Credit : RCB-X Handle

RCB : ఆర్సీబీ కొత్త బాస్ వచ్చేశాడు.. IPL 2026 ముందే అదిరిపోయే న్యూస్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత భారీ డీల్ ఒకటి జరిగింది. పెద్ద సంఖ్యలో అభిమానులను కలిగి జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం మారింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ సంస్థలతో కూడిన ఒక కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ భారీ లావాదేవీ విలువ 1.78 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 16,706 కోట్లు) గా నిర్ణయించారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

26
ఆర్సీబీ 100 శాతం వాటా కొనుగోలు
Image Credit : Getty

ఆర్సీబీ 100 శాతం వాటా కొనుగోలు

యూకేకు చెందిన డయాజియో పీఎల్‌సీ అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుండి ఆర్సీబీకి చెందిన 100 శాతం వాటాను ఈ కన్సార్టియం దక్కించుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఐపీఎల్‌లోని పురుషుల జట్టుతో పాటు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లోని మహిళా జట్టు కూడా కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లింది. ఈ విక్రయానికి సంబంధించి ఇప్పటికే ఒప్పంద పత్రాలపై సంతకాలు పూర్తయ్యాయి. ఈ డీల్‌లో కొనుగోలుదారుల తరపున A&W క్యాపిటల్, మోయిలిస్, ఖైతాన్ అండ్ కో సలహాదారులుగా వ్యవహరించారు.

Related Articles

Related image1
IPL : స్టేజ్ పై హార్దిక్, సూర్య.. అభిమానుల రచ్చ.. రోహిత్ ఎంట్రీతో సీన్ మారిపోయింది !
Related image2
IPL షాకింగ్: ఆర్సీబీ కంటే ముందే రికార్డు కొట్టిన రాజస్థాన్ రాయల్స్.. ఏకంగా వేల కోట్లకు అమ్మకం!
36
ఆర్సీబీ కొత్త చైర్మన్‌గా ఆర్యమాన్ బిర్లా
Image Credit : Getty

ఆర్సీబీ కొత్త చైర్మన్‌గా ఆర్యమాన్ బిర్లా

జట్టు యాజమాన్యం మారడంతో పాలక మండలిలోనూ మార్పులు వచ్చాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమాన్ విక్రమ్ బిర్లా ఆర్సీబీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌నకు చెందిన సత్యన్ గజ్వానీ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కన్సార్టియంలో బోల్ట్ వెంచర్స్ వ్యవస్థాపకుడు డేవిడ్ బ్లిట్జర్, బ్లాక్‌స్టోన్ పీఈ స్ట్రాటజీ సీఈఓ వైరల్ పటేల్ కూడా కీలక భాగస్వాములుగా ఉన్నారు. అయితే, ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి బీసీసీఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు రావాల్సి ఉంది.

46
ఆర్సీబీ కొనుగోలు.. బిర్లా గ్రూప్ ఏం చెప్పింది?
Image Credit : Getty

ఆర్సీబీ కొనుగోలు.. బిర్లా గ్రూప్ ఏం చెప్పింది?

ఈ కొనుగోలుపై ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా స్పందిస్తూ.. "గత రెండు దశాబ్దాలుగా ఐపీఎల్ ప్రపంచ క్రీడారంగంలో ఒక శక్తిగా ఎదిగింది. భారతీయ క్రికెట్ రూపురేఖలను మార్చేసింది. ఆధునిక క్రీడల్లో ఆర్సీబీ ఒక అద్భుతమైన బ్రాండ్. ఈ ఆస్తికి సంరక్షకులుగా మారడం మాకు సంతోషంగా ఉంది. ఆర్సీబీ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం" అని పేర్కొన్నారు. కొత్త చైర్మన్ ఆర్యమాన్ బిర్లా మాట్లాడుతూ.. క్రీడలు, మీడియా, వినియోగదారుల వ్యాపారాల పట్ల తమకు ఉన్న అవగాహన ఆర్సీబీ తదుపరి వృద్ధికి దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

56
ఆర్సీబీని ఎందుకు అమ్మాల్సి వచ్చింది?
Image Credit : Getty

ఆర్సీబీని ఎందుకు అమ్మాల్సి వచ్చింది?

ఆర్సీబీ జట్టును ప్రారంభంలో విజయ్ మాల్యా నేతృత్వంలోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ 111.6 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత యాజమాన్యం డయాజియో చేతుల్లోకి వెళ్లింది. అయితే, జూన్ 4, 2025న ఆర్సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత, తమ కోర్ బిజినెస్ కాని క్రికెట్ ఫ్రాంచైజీ నుండి తప్పుకోవాలని డయాజియోపై ఒత్తిడి పెరిగింది. దీంతో గతేడాది నవంబర్‌లోనే జట్టును విక్రయించబోతున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీకి సమాచారం అందించారు.

66
శనివారం నుండే ఆర్సీబీ కొత్త ప్రస్థానం
Image Credit : Getty

శనివారం నుండే ఆర్సీబీ కొత్త ప్రస్థానం

టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ చైర్మన్ సత్యన్ గజ్వానీ మాట్లాడుతూ.. "ఆర్సీబీ ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్. కర్ణాటక ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ జట్టును గ్లోబల్ స్పోర్టింగ్ ఇన్‌స్టిట్యూషన్‌గా మారుస్తాం" అని చెప్పారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే ఈ మార్పు జరిగింది. శనివారం జరగబోయే మ్యాచ్‌లో తమ టైటిల్‌ను కాపాడుకునేందుకు ఆర్సీబీ బరిలోకి దిగనుంది. కొత్త యజమానుల రాకతో జట్టులో కొత్త ఉత్సాహం నెలకొంది

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
విరాట్ కోహ్లీ
బెంగళూరు
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL షాకింగ్: ఆర్సీబీ కంటే ముందే రికార్డు కొట్టిన రాజస్థాన్ రాయల్స్.. ఏకంగా వేల కోట్లకు అమ్మకం!
Recommended image2
Anaya Bangar : అబ్బాయి నుండి అమ్మాయిగా మారిన ఇండియన్ క్రికెటర్ .. ఈ ట్రాన్స్ జెెండర్ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..?
Recommended image3
IPL 2026: ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ వార్.. ఆ ఇద్దరిలో ఒకరు ఫైనల్‌గా..
Related Stories
Recommended image1
IPL : స్టేజ్ పై హార్దిక్, సూర్య.. అభిమానుల రచ్చ.. రోహిత్ ఎంట్రీతో సీన్ మారిపోయింది !
Recommended image2
IPL షాకింగ్: ఆర్సీబీ కంటే ముందే రికార్డు కొట్టిన రాజస్థాన్ రాయల్స్.. ఏకంగా వేల కోట్లకు అమ్మకం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved