MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND vs NZ : టీమిండియాలో భారీ మార్పులు.. రోహిత్, విరాట్ వచ్చారు.. హార్దిక్, షమీ ఔట్!

IND vs NZ : టీమిండియాలో భారీ మార్పులు.. రోహిత్, విరాట్ వచ్చారు.. హార్దిక్, షమీ ఔట్!

Team India : న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికవగా, రోహిత్, విరాట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటుదక్కలేదు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 03 2026, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
IND vs NZ Squad: రిషబ్ పంత్‌కు ఛాన్స్.. రుతురాజ్‌కు షాక్.. జట్టు వివరాలు ఇవే
Image Credit : insta/indiancricketteam

IND vs NZ Squad: రిషబ్ పంత్‌కు ఛాన్స్.. రుతురాజ్‌కు షాక్.. జట్టు వివరాలు ఇవే

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే సిరీస్‌ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారికంగా జట్టును ప్రకటించింది. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌ కోసం సెలెక్టర్లు యువ రక్తం, సీనియర్ల అనుభవాన్ని మేళవించి జట్టును ఎంపిక చేశారు.

రాబోయే టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కెప్టెన్ గా తిరిగివచ్చాడు. అదే సమయంలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.

26
శుభ్‌మన్ గిల్ చేతికి పగ్గాలు - సీనియర్ల రీఎంట్రీ
Image Credit : Getty

శుభ్‌మన్ గిల్ చేతికి పగ్గాలు - సీనియర్ల రీఎంట్రీ

ఈ సిరీస్ కు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. భవిష్యత్తు నాయకత్వ బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ గిల్ పై ఈ నమ్మకాన్ని ఉంచినట్లు తెలుస్తోంది. గతంలో దక్షిణాఫ్రికా సిరీస్ సమయంలో గాయం కారణంగా గిల్ దూరమవగా, కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు గిల్ పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి రావడంతో కెప్టెన్సీ పగ్గాలు అతనికే దక్కాయి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడనున్నారు. గిల్ కెప్టెన్సీలో ఈ దిగ్గజాలు ఆడతుండటం విశేషం. వీరి రాకతో టాప్ ఆర్డర్ మరింత పటిష్ఠంగా మారనుంది.

Related Articles

Related image1
Mustafizur Rahman : రూ. 9.20 కోట్లు పెట్టి కొన్న బౌలర్‌ను వదిలేసిన కేకేఆర్ ! కారణం ఇదే..
Related image2
Mustafizur Rahman : రూ. 9.20 కోట్లు పెట్టి కొన్న బౌలర్‌ను వదిలేసిన కేకేఆర్ ! కారణం ఇదే..
36
హార్దిక్ పాండ్యాను ఎందుకు పక్కన పెట్టారు?
Image Credit : Getty

హార్దిక్ పాండ్యాను ఎందుకు పక్కన పెట్టారు?

జట్టు ప్రకటనలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటుదక్కకపోవడం. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో 133 పరుగులతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, అతడిని వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. దీనికి ప్రధాన కారణం ఫిట్‌నెస్, వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ అని బీసీసీఐ స్పష్టం చేసింది.

హార్దిక్ పాండ్యా ప్రస్తుతం పూర్తి కోటా 10 ఓవర్లు బౌలింగ్ చేయడానికి మెడికల్ టీమ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. 2026 ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, అతడిని కేవలం పొట్టి ఫార్మాట్‌కే పరిమితం చేయాలని బోర్డు భావిస్తోంది. ప్రపంచ కప్ కోసం హార్దిక్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

46
శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్.. కానీ
Image Credit : Getty

శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్.. కానీ

మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జట్టులోకి తిరిగి రావడమే కాకుండా, వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన తర్వాత అయ్యర్ ఆటకు దూరమయ్యాడు. అయితే, అతడు జట్టులో ఉన్నప్పటికీ, అతడి ఎంపిక పూర్తి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ పేర్కొంది.

బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తేనే శ్రేయస్ మైదానంలోకి దిగుతాడు. ఒకవేళ అతడు ఫిట్ కాకపోతే జట్టు కూర్పులో మార్పులు జరిగే అవకాశం ఉంది.

56
రుతురాజ్‌ గైక్వాడ్ కు నిరాశ
Image Credit : X/BCCI

రుతురాజ్‌ గైక్వాడ్ కు నిరాశ

దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లకు సెలెక్టర్లు పెద్దపీట వేశారు. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. వీరిని ఇంపాక్ట్ ప్లేయర్స్ గా తీర్చిదిద్దే యోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్ స్థానం కోసం రిషబ్ పంత్ తన చోటును నిలబెట్టుకోగా, కేఎల్ రాహుల్ ప్రధాన కీపర్‌గా ఉండే అవకాశం ఉంది.

అయితే, దక్షిణాఫ్రికా సిరీస్‌లో సెంచరీతో రాణించిన రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ధ్రువ్ జురెల్, తిలక్ వర్మలకు కూడా ఈసారి అవకాశం దక్కలేదు. ఇక సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత జట్టులో కనిపించలేదు. ఈ సిరీస్‌లో కూడా అతనికి చోటు దక్కలేదు.

66
భారత వన్డే జట్టు ఇదే
Image Credit : X/BCCI

భారత వన్డే జట్టు ఇదే

భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్.

భారత్ vs కీవీస్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే

  1. జనవరి 11: మొదటి వన్డే - వడోదర
  2. జనవరి 14: రెండో వన్డే - రాజ్‌కోట్
  3. జనవరి 18: మూడో వన్డే - ఇండోర్

ఈ మూడు వన్డేల తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరగనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mustafizur Rahman : రూ. 9.20 కోట్లు పెట్టి కొన్న బౌలర్‌ను వదిలేసిన కేకేఆర్ ! కారణం ఇదే..
Recommended image2
Hardik Pandya : 6, 6, 6, 6, 6, 4 హార్దిక్ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 34 పరుగులతో మెరుపు సెంచరీ
Recommended image3
Cricket : చెడు అలవాట్లతో చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్న టాలెెంటెడ్ క్రికెటర్లు.. టాప్ 5 లిస్ట్
Related Stories
Recommended image1
Mustafizur Rahman : రూ. 9.20 కోట్లు పెట్టి కొన్న బౌలర్‌ను వదిలేసిన కేకేఆర్ ! కారణం ఇదే..
Recommended image2
Mustafizur Rahman : రూ. 9.20 కోట్లు పెట్టి కొన్న బౌలర్‌ను వదిలేసిన కేకేఆర్ ! కారణం ఇదే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved