టీమిండియాతో ఘోర ఓటమి.. పాక్ జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్.!
Pakistan Team: ఐసీసీ టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ను భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్లో ఒక ఆసక్తికర సీన్ చోటుచేసుకుంది.

పాక్ చిత్తు..
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను టీమ్ ఇండియా మరోసారి చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు 61 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్ను మట్టికరిపించి, టోర్నమెంట్లో తమ పటిష్టతను నిరూపించుకుంది.
ఇషాన్ కీలక పాత్ర
భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు ఇషాన్ కిషన్. విధ్వంసకర బ్యాటింగ్తో అలరించిన ఇషాన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో అద్భుతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇషాన్ కిషన్తో పాటు సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే తోడవ్వడంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇషాన్ కిషన్ సారీ
అయితే, ఈ మ్యాచ్లో హై స్కోరింగ్ ప్రదర్శనతో పాటు ఒక ఆసక్తికర సీన్ చోటు చేసుకుంది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తుండగా డబుల్ కోసం పరుగు తీసే క్రమంలో పాక్ వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ ను ఢీకొట్టాడు. వాస్తవానికి ఉస్మాన్ ఖాన్ ది తప్పైనప్పటికీ.. ఇషాన్ కిషన్ నవ్వుతూ క్షమాపణలు చెప్పి గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు.
ఘోర పరాజయం
అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయారు. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ ఒక్కడే 44 పరుగులతో కాస్త పోరాడినా, మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పాకిస్థాన్ 18 ఓవర్లలో కేవలం 114 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఆ ఇద్దరిపై వేటు
ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ పై పాక్ జట్టు మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా సూపర్ 8 సమయానికి జట్టులో నుంచి షాహీన్ షా అఫ్రిది, బాబర్ ఆజామ్లను జట్టు నుంచి తప్పిస్తారని టాక్. వారి స్థానాల్లో సల్మాన్ మీర్జా, నసీమ్, ఫకర్, ఖవాజా పేర్లను నమీబియాతో మ్యాచ్ కు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

