MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Maha Shivaratri: ద్వాదశ జ్యోతిర్లింగాలు.. వాటి ప్రాముఖ్యత

Maha Shivaratri: ద్వాదశ జ్యోతిర్లింగాలు.. వాటి ప్రాముఖ్యత

Maha Shivaratri: మహా శివరాత్రి సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని ఎంతో మంది భావిస్తుంటారు. సామాన్యుడు సైతం ఆ భోళాశంకరుడిని దర్శించుకునేందుకు ఆ పరమేశ్వరుడు లింగ రూపం ధరించాలని పురాణాలు చెబుతున్నాయి. మన దేశంలో 12 చోట్ల జ్యోతిర్లింగాలు నెలకొల్పబడ్డాయి. వాటి విశేషాలు..

2 Min read
Mahesh Rajamoni
Published : Feb 28 2022, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
jyothir12

jyothir12

 జ్యోతిర్లింగం అంటే శివుడు లింగ రూపంలో ఉండే చోటు. సామాన్యులు కూడా తనను పూజించేందుకు, ఆరాధించడానికి అణువుగా ఉండేందుకే ఆ పరమేశ్వరుడు ఇలా లింగ రూపం దాల్చాడని పురాణాలు చెబుతున్నాయి. మనదేశంలో 12 చోట్ల జ్యోతిర్లింగాలను నెలకొల్పారు. ఈ జ్యోతిర్లింగాల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ఈ మహా శివరాత్రికి అక్కడికి వెళ్లే వారు ఎంతో మంది ఉన్నారు. వాటి విశేషాలు తెలుసుకుందాం పదండి..

213
somanatha

somanatha

సోమనాథ్ ఆలయం:  మన దేశంలో 12 చోట్ల నెలకొల్పబడిన జ్యోతిర్లింగాలలో సోమనాథ్  దేవాలయం మొదటిది. ఈ ఆలయం గుజరాత్ లోని సౌరాష్ట్ర జిల్లాలో ఉంది. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే.. ఈ దేవాలయానికి వచ్చిన  శ్రీకృష్ణుడు తన లీలతో వెలిగించిన దీపం నేటికి కూడా వెలిగుతూనే ఉంది. కాగా ఈ దేవాలయం దగ్గరున్న చంద్రకుండంలో తలస్నానం చేసి సోమనాథున్ని దర్శించుకుంటే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు.

313
srisailam

srisailam

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం: ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం కొండల్లో కొలువు దీరిన మల్లిఖార్జున స్వామి కోరిన మొక్కులను తీరుస్తాడని భక్తలు విశ్వసిస్తారు. శ్రీశైలంలో ఆ ఈశ్వరుడుడు గౌరీదేవి, భ్రమరాంబ తో కొలువుదీరాడు. ఈ శ్రీశైల మహాక్షేత్రం హైదరాబాద్ నుంచి 230 కి. మీ దూరంలో ఉంటుంది. 

413
rameshwaralayam

rameshwaralayam

శ్రీ రామేశ్వరాలయం:  శ్రీ రామేశ్వరాలయం తమిళనాడులో ఉంది. రాముడు రావణుడిపై గెలిచినందుకు గుర్తింపుగా ఈ కట్టడ నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతుంటారు. కాగా రామేశ్వరంలో మొత్తం 64 నీటి ఆవాసాలున్నాయి. వీటిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయిని ప్రజలు విశ్వసిస్తారు. 

513
omkareswar

omkareswar

శ్రీ ఓంకారేశ్వరుడు: ఓంకారేశ్వర పుణ్య క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో ఉంది. ఈ పుణ్య క్షేత్రానికి ఓంకారేశ్వర దేవాలయం అని పేరుపొందింది.  ఈ క్షేత్రాలను ఆకాశం పైనుంచి చూసినట్టైతే మనకు ఓం ఆకారం కనిపిస్తదట.

613
mahakaleswaram

mahakaleswaram

మహాకాలేశ్వరాలయం: శ్రీ మహా కాళేశ్వరాలయం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ లో ఉంది. ఈ జ్యోతిర్లింగాలయం తాంత్రిక మంత్రాలతో నడుపబడుతోంది. ఈ మహా దేవుడికి పాతఃకాలం భస్మాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు ఇక్కడున్న కాలభైరవుడికి మద్యం (ఆల్కహాల్) ను నైవేద్యంగా పెడతారట.

713
bhimeswar

bhimeswar

శ్రీభీమేశ్వరుడు: భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సహ్యద్రి కొండలు పూణేకు 110 కి.మీ దూరంలో ఉంటుంది. అంటే కృష్ణానది ఉపనది అయిన భీమనది ఉద్భవించిన చోటులో శ్రీ భీమశంకరుడు వెలసాడు. ఈ ఆలయాన్ని 13 వ శాతాబ్దంలో నిర్మించినట్టు తెలుస్తోంది. కాగా ఈ లింగం కుంభకర్ణుడి కొడుకైన రాక్షస భీమున్ని నాశనం చేసే పరమేశ్వరుడి రూపంలో ఉంటుంది.

813
thrayambaka

thrayambaka

శ్రీ త్రయంబకేశ్వరుడు: త్రయంబుకేశ్వరాలయం మహారాష్ట్రలోని నాసిక్ కు 30 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రం గురించి రెండు కథాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఒకటి బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా కొలువుదీరట. 

913

శ్రీ విఘ్నేశ్వరాలయం: శ్రీ విఘ్నేశ్వరాలయం మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ పట్టణానికి 30 కి.మీ దూరంలో అజంతా ఎల్లోరా గ్రామంలో ఉంటుంది. కాగా ఈ గ్రామంలో దేవగిరి కొండపై దేవుడు కొలువు దీరాడు. ఇది ప్రఖ్యాతి గాంచిన దేవాలయంగా పేరుపొందింది.

1013
naganath

naganath

శ్రీనాగనాథేశ్వరుడు: పాండవులు అరణ్యవాసంలో దారుకా వనంలో ఉన్నప్పుడు వారే ఈ దేవాలయాన్ని నిర్మించారని పురాణాల్లో ఉంది. ఈ ఆలయం విషయంలో కొంచెం వివాదం కూడా ఉంది. నాగనాథ జ్యోతిర్లింగంగా రెండు మూడు ఆలయాలను పిలుస్తూ ఉంటారు. కానీ నాగనాథేశ్వర ఆలయం  బైత్ ద్వారక ద్వీపం , గోమతి ద్వారక ఆలయాలు చాలా ప్రసిద్ది పొందాయి.

1113
vidyanath

vidyanath

శ్రీ వైద్యనాధేశ్వరుడు: శ్రీవైద్యనాధేశ్వరాలయం జార్ఖండ్ లో ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని పూజిస్తే సర్వ రోగాలు నయమవుతాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. 

1213
vishwanatheswarudu

vishwanatheswarudu

శ్రీవిశ్వనాథేశ్వరుడు: కాశీలో శ్రీ విశ్వనాథేశ్వరుడు కొలువు దీరాడు. ఈ పుణ్యక్షేత్రంంలో స్నానం చేసి ఆ పరమేశ్వరుణ్ని దర్శించుకోవడం వల్ల మరుజన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి.

1313
kedernath

kedernath

శ్రీ కేదారేశ్వరుడు: కేదారేశ్వరాలయం ఉత్తరాఖండ్ లో ఉంది. ఈ ఆలయం కేవలం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. పాండవులే ఈ ఆలయాన్ని నిర్మించారట. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved