MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • కలియుగం గురించి శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడో.. ఇప్పుడు అదే జరుగుతోందా?

కలియుగం గురించి శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడో.. ఇప్పుడు అదే జరుగుతోందా?

పురణాల ప్రకారం మహాభారత కాలంలో శ్రీ కృష్ణుడు.. పాండవులకు కలియుగం గురించి కొన్ని విషయాలు చెప్పాడట. అవి ప్రస్తుతం నిజమవుతున్నాయని చాలామంది నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు? ప్రస్తుతం ఏం జరుగుతోందో.. ఇక్కడ తెలుసుకుందాం.   

1 Min read
Kavitha G
Published : May 23 2025, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కలియుగం గురించి శ్రీకృష్ణుడు పాండవులకు ఏం చెప్పాడు? 
Image Credit : our own

కలియుగం గురించి శ్రీకృష్ణుడు పాండవులకు ఏం చెప్పాడు? 

కలియుగం గురించి చాలా శాస్త్రాల్లో ప్రస్తావించారు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాండవులకు కలియుగం గురించి కొన్ని నిజాలు చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. కలియుగం ఎలా ఉంటుంది? ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి? మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది తదితర విషయాలు పాండవులకు వివరించాడట. అవి ఈ కాలంలో నిజమవుతున్నాయని చాలామంది నిపుణులు చెబుతున్నారు. మరి కృష్ణుడు కలియుగం గురించి ఏం చెప్పాడో ఇక్కడ చూద్దాం.

25
జ్ఞాపకశక్తి తగ్గుతుంది

జ్ఞాపకశక్తి తగ్గుతుంది

మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు.. పాండవులకు కలియుగంలో మనుషుల జ్ఞాపకశక్తి తగ్గుతుందని చెప్పాడు. అంతేకాదు, ధర్మం, సత్యం, సహనం కూడా తగ్గుతాయని చెప్పాడు. ప్రస్తుతం చాలామందిలో మనం ఇది చూస్తున్నామని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 5 రాశులకు నరదిష్టి ఎక్కువ.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Related image2
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలకి మంచి భర్తలు వస్తారు!
35
గుణానికి కాదు.. డబ్బుకు ప్రాధాన్యం

గుణానికి కాదు.. డబ్బుకు ప్రాధాన్యం

కలియుగంలో ఒక వ్యక్తిని అతని గుణాలతో కాకుండా డబ్బుతో గుర్తిస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారికే గౌరవ, మర్యాదలు దక్కుతాయని కృష్ణుడు వివరించాడు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. 

45
జ్ఞానం లేకపోయినా పండితులవుతారు

జ్ఞానం లేకపోయినా పండితులవుతారు

కలియుగంలో జ్ఞానం, ధర్మం మీద దృష్టి పెట్టరని శ్రీ కృష్ణుడు.. పాండవులతో చెప్పాడట. అంతేకాదు ఎవరు చనిపోతారు? ఎవరి ఆస్తిని ఎలా సొంతం చేసుకోవాలనే ఆలోచనలు కూడా మనుషుల్లో ఎక్కువగా ఉంటాయని కృష్ణుడు వివరించాడట. సరిగ్గా ఇలాంటి సంఘటనలను మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నామనేది నిపుణుల మాట.

55
దుఃఖంలో ఒంటరిగా ఉంటారు

దుఃఖంలో ఒంటరిగా ఉంటారు

పురాణాల ప్రకారం కలియుగంలో ఒక వ్యక్తి దుఃఖంలో ఒంటరిగా ఉంటాడని శ్రీ కృష్ణుడు ముందుగానే చెప్పాడు. అంతేకాదు సంతోష సమయంలో చాలా మంది చుట్టూ ఉంటారని కూడా వివరించాడట. ఇది చాలామంది వారి జీవితంలో ఏదో ఒక టైంలో ఎదుర్కొనే ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved