MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • కృష్ణాష్టమి 2023: శ్రీకృష్ణుడి శరీరం నీలం రంగులోనే ఎందుకుంటుందో తెలుసా?

కృష్ణాష్టమి 2023: శ్రీకృష్ణుడి శరీరం నీలం రంగులోనే ఎందుకుంటుందో తెలుసా?

krishna janmashtami 2023: ఈ రోజు శ్రీకృష్ణాష్టమి. ఈ రోజున గోపాలుడిని నిష్టగా పూజిస్తే సకల బాధలు పోయి సంతోషం, సంపదలు పెరుగుతాయని నమ్మకం. అయితే మరి గోపాలుడి శరీరం నీలి రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?  

2 Min read
Mahesh Rajamoni
Published : Sep 06 2023, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Janmashtami 2023 date

Janmashtami 2023 date

సనాతన పంచాంగం ప్రకారం.. ప్రతి సంవత్సరం రోహిణి నక్షత్రంలో భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం అష్టమి రోజున కృష్ణాష్టమి పండుగను జరుపుకుంటారు. శ్రీకృష్ణుని జీవిత చరిత్రను ధార్మిక గ్రంథాలలో వివరంగా వివరించారు. భగవంతుని అనుగ్రహం అపారమైనది. వీరి గురించి విన్నప్పుడు, చదివినప్పుడు, వీరి గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలం మరింత పెరుగుతుంది.  గోపాలుడి లీలల కారణంగా ఆయనను ఎన్నో పేర్లతో పిలుస్తారు. వాటిలో ఒకటి శ్యామ్. శ్యామ్ అంటే నీలం అని అర్థం. అంతేకాకుండా శ్రీకృష్ణుడి శరీర రంగు కూడా నీలం రంగులోనే ఉంటుంది. మరి శ్రీకృష్ణుని నీలి రంగు శరీరం రహస్యం గురించి పురాణాల్లో ఏముందో  ఇప్పుడు తెలుసుకుందాం.. 

24

పురాణం ప్రకారం..

అధర్మాన్ని పూర్తిగా తుడిచిపెట్టి ధర్మ స్థాపన కోసం శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో మానవ రూపంలోకి అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. గోపాలుడు దేవకి గర్భం నుంచి జన్మించాడు. అయితే శ్రీకృష్ణుని మేనమామ కంసుడు దేవకి ఎనిమిదో సంతానం చేతిలో తాను చంపబడతాడని తెలుసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కంసుడు శ్రీకృష్ణుడిని చంపడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కానీ ఎన్ని చేసినా గోపాలుడిని ఏం చేయలేకపోతాడు. 

34

తనవల్ల కావట్లేదని తెలుసుకున్న కంసుడు ఒకసారి శ్రీకృష్ణుడిని చంపడానికి పుతానా అనే రాక్షసుడిని పంపుతాడు. పూతన పాలలో విషం కలిపి గోపాలుడికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అయితే శ్రీకృష్ణుడికి ఈ మొదటి నుంచీ పుతన ఉద్దేశం తెలుసు. అందుకే పాలు తాగే నెపంతో విషం తాగుతాడు. అయితే ఆ విషం దేవుడిని ప్రభావితం చేయకపోయినా విషం ద్వారే పుతనుని చంపుతాడు. అయితే విషం కారణంగా శ్రీకృష్ణుడి శరీరం నీలం రంగులోకి మారుతుంది. 
 

44


మరో పురాణం ప్రకారం..

పురాణం ప్రకారం.. ఒకసారి శ్రీకృష్ణుడు నది ఒడ్డున గోపికలతో ఆడుకుంటుంటాడు. అయితే వారు ఆడుకుంటున్న బంతి పక్కన ఉన్న యమునా నదిలోకి వెళ్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు బంతిని తీసుకోవడానికి యమునా నదిలోకి వెళతాడు. అయితే ఆ రోజుల్లో యమునా నదిలో కాలియా అనే విషపూరితమైన నాగు ఉండేంది. కన్నయ్య వెళ్లిన శబ్దానాకి యమునా నదిలో నుంచి నాగుడు బయటకు వచ్చాడు. అయితే ఆ నాగు విషం కారణంగా యమునా నది నీరంతా నీలం రంగులోకి మారుతుంది. కాళియా నాగునికి, శ్రీకృష్ణుడికి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో గోపాలుడు కాలియా నాగ్ ను ఓడించాడు. అయితే విషం ప్రభావంతో శ్రీకృష్ణుడి శరీరం నీలం రంగులోకి మారిపోయిందని పురాణం చెబుతోంది.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved