MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • మంగళవారం నాడు ఈ పనులు చేయండి.. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి

మంగళవారం నాడు ఈ పనులు చేయండి.. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి

మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజిస్తారు. ఈ రోజు హనుమంతుడిని పూజించే వారికి శ్రీరాముడి అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రంలో ఈ రోజుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక పరిహారాలు ఉన్నాయి. ఇవి చేస్తే మీ జీవితంలోని అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

1 Min read
Shivaleela Rajamoni
Published : Nov 21 2023, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సనాతన ధర్మంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాగే ప్రతిరోజూ ఏదో ఒక దేవుని ఆరాధనకు అంకితం చేయబడింది కూడా. ఈ రోజు మనం ఆంజనేయ స్వామిని పూజిస్తాం. మంగళవారం ఆంజనేయ స్వామికి అంకితం చేయబడింది. ఈ రోజు ఆంజనేయ స్వామికి పూజలు చేస్తే.. ఈ దేవుడి అనుగ్రహంతో పాటుగా శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు. అయితే ఈ దేవుళ్ల అనుగ్రహం పొందేందుకు జ్యోతిష్య శాస్త్రంలో ఈ రోజు కొన్ని పరిహాలను ఖచ్చితంగా చేయాలి. అవేంటో తెలుసుకుందాం పదండి. 

25

మంగళ దోషం ప్రభావం తగ్గాలంటే.. 

మంగళ దోషం తొలగిపోవాలంటే..  మంగళవారం నాడు ఉదయాన్నే స్నానం చేయాలి. ఆ తర్వాత హనుమంతుని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అలాగే రామ భక్తులకు ప్రసాదాన్ని పెట్టాలి. ఇలా వరుసగా ఏడు మంగళవారాలు చేస్తే మంగళ దోష ప్రభావం తగ్గుతుంది.

35

హనుమంతుని అనుగ్రహం కోసం.. 

మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ప్రతి మంగళవారం నాడు 7 సార్లు హనుమాన్ చాలీసాను పఠించండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి సంతోషపడతాడు. అంతేకాదు వీళ్లపై ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. 
 

45

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే..

పేదరికం, డబ్బు సమస్యల నుంచి మీరు బయటపడాలంటే మంగళవారం నాడు కోతులకు బెల్లం, శనగలు తినిపించండి. ఒకవేళ ఇది మీకు వీలుకాకపోతే.. అవసరమైన వారికి ఆహారాన్నిపెట్టండి. ఇలా వరుసగా 11 మంగళవారాలు చేయండి. దీనివల్ల మీరు శాశ్వతంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. 
 

55

దృష్టి లోపాలను దూరం చేసుకోవాలంటే..

ఏదో ఒక మంగళవారం నాడు బార్లీ పిండిలో నల్ల నువ్వులు, ఆవనూనె కలిపి రొట్టె తయారు చేయండి.  ఈ రొట్టెను తలచుట్టూ ఏడు సార్లు తిప్పి గేదెకు తినిపించండి. ఇది కంటిచూపు చెడు ప్రభావాన్ని వెంటనే తొలగిస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved