Kashi Cremation కాశీలో ఎలాంటి శవాలను దహనం చేయరు? విస్తుపోయే కారణం!
హిందూ మతాన్ని బాగా విశ్వసించేవారు తమ చివరి రోజులలో కాశీలో తనువు చాలించాలి అనుకుంటారు. అందుకే అక్కడ నిత్యం వందల సంఖ్యలో శవాలు దహనం అవుతుంటాయి. అయితే దీంతోపాటు అక్కడ కొన్ని ఆచారాలు, నమ్మకాలు ఉన్నాయి. అక్కడ కొందరి శవాలను దహనం చేయరు! గర్భిణులు, సాధువులు, పిల్లలు, పాము కాటుతో చనిపోయిన వారి అంత్యక్రియలు వేరుగా ఉంటాయి. దీని వెనుక ఉన్న రహస్యాలు ఏమిటంటే..!
12

గర్భిణి శవాలను కాశీలో దహనం చేయరు. గర్భిణుల శరీరాన్ని కాల్చితే కడుపు ఉబ్బి చితిలో పేలే అవకాశం ఉందని ఈ నమ్మకం. కాశీలో సాధువుల శవాలను కాల్చరు. వారి శవాలను నీటిలో వదిలేస్తారు లేదా పాతిపెడతారు. కాశీలో చిన్న పిల్లల శవాలను కూడా కాల్చడం నిషేధం.
Add Asianetnews Telugu as a Preferred Source

22
పాము కాటుతో చనిపోయిన వారి శవాలను కాశీలో దహనం చేయరు. పాము కాటుతో చనిపోయిన వారి మెదడు 21 రోజుల వరకు బతికే ఉంటుందని నమ్ముతారు. చర్మ వ్యాధి లేదా కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి చనిపోతే, అతని శరీరాన్ని కాశీలో దహనం చేయరు. వారి శవాలను కాల్చడం వల్ల వ్యాధి బ్యాక్టీరియా గాలిలో వ్యాపిస్తుంది.
Latest Videos