MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • కేవలం సంక్రాంతికి మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఒక్కరోజే గర్భగుడిలో దేవుడి విగ్రహం..!

కేవలం సంక్రాంతికి మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఒక్కరోజే గర్భగుడిలో దేవుడి విగ్రహం..!

Makara Sankranti 2026: మధ్యప్రదేశ్‌ పన్నా జిల్లాలోని అజయ్‌గఢ్ కోట చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఒక ఆలయం ఉంది… ఇది మకర సంక్రాంతి రోజున మాత్రమే తెరుచుకుంటుంది. ఒకే రోజు ఆ ఆలయంలో దేవుడు ఉంటాడు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Jan 12 2026, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అజయ్‌గఢ్ కోట రహస్యం ఏమిటి?
Image Credit : Getty

అజయ్‌గఢ్ కోట రహస్యం ఏమిటి?

చారిత్రకారుల ప్రకారం… 9 నుండి 13వ శతాబ్దం వరకు బుందేల్ ఖండ్ ను పాలించిన చందేలా రాజులు అజయ్ గడ్ కోటను నిర్మించారు. వింద్యా పర్వతశ్రేణుల్లో ఈ కోట ఉంటుంది. ఈ కోటలో స్థానిక దైవంగా భావించే బాబా అజయ్ పాల్ ఆలయం ఉంది. ఈ ఆలయం కేవలం మకర సంక్రాంతికి మాత్రమే తెరుచుకుంటుంది. 

24
ఒక్క రోజు మాత్రమే ఆలయంలో బాబా విగ్రహం..
Image Credit : Getty

ఒక్క రోజు మాత్రమే ఆలయంలో బాబా విగ్రహం..

ఏడాదిపోవడవునా అజయ్‌గఢ్ కోటలోని బాబా అజయ్ పాల్ ఆలయం మూసివుంటుంది… ఇందులో దేవుడి విగ్రహం ఉండదు. మకర సంక్రాంతి రోజున రేవా మ్యూజియం నుంచి బాబా అజయ్ పాల్ విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠిస్తారు. మరుసటి రోజు తిరిగి మ్యూజియంకు తరలిస్తారు. ఇలా ఒకే ఒక్కరోజు ఆలయంలో విగ్రహాన్ని దర్శించుకోవచ్చు.. మిగతా రోజుల్లో ఆలయం మూసివుంటుంది. 

Related Articles

Related image1
తమిళనాడులో 200 ఏళ్ల పురాతన ఆలయంలోకి తొలిసారి దళితుల ప్రవేశం
Related image2
Mystery Temple: రాత్రయితే చాలు కాళీమాత విగ్రహం మాయమయ్యే ఆలయం, ఎందుకలా జరుగుతుంది?
34
ఇక్కడి నిధుల గురించి ఒక నమ్మకం ఉంది
Image Credit : Getty

ఇక్కడి నిధుల గురించి ఒక నమ్మకం ఉంది

అజయ్‌గఢ్ కోటలో చాలా మూసి ఉన్న సొరంగాలు ఉన్నాయి. ఈ సొరంగాల్లో చందేల రాజుల నిధి దాగి ఉందని నమ్మకం. చాలా మంది దీని కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.

అజయ్ గడ్ కోటలో ఓ పురాతన శాసనం ఉంది... దీన్ని ఇప్పటివరకు ఎవరూ అర్థంచేసుకోలేకపోయారు. దీనిలోనే చందేలా రాజుల రహస్య సంపదకు మార్గం ఉండవచ్చని భావిస్తున్నారు.

44
గవి గంగాధరేశ్వర ఆలయం కూడా ఇలాగే..
Image Credit : X/mishra_shani

గవి గంగాధరేశ్వర ఆలయం కూడా ఇలాగే..

కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా ఇలాగే కేవలం సంక్రాంతికే తెరుచుకునే మరో ఆలయం ఉంది. ప్రతి ఏడాది సరిగ్గా మకర సంక్రాంతి రోజుల గవి గంగాధరేశ్వర ఆలయంలోని శివలింగంపై సూర్యకిరణాలు పడతాయి. ఈ సమయంలో ఆలయమంతా కాంతిలో వెలిగిపోతుంది. ఈ ప్రత్యేక సమయంలో స్వామిని దర్శించుకునేందుకు ప్రజలు భారీగా తరలివస్తారు. ఈ ఆలయాన్ని 16 శతాబ్దంలో కెంపెగౌడ్ నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?
Recommended image2
2026 Wedding Muhurtas: 2026లో అద్భుతమైన పెళ్లి ముహూర్తాలు..ఏ నెలలో ఎక్కువ ముహూర్తాలు..?
Recommended image3
Chanakya Niti: పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా.? ఇలాంటి మ‌హిళ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది
Related Stories
Recommended image1
తమిళనాడులో 200 ఏళ్ల పురాతన ఆలయంలోకి తొలిసారి దళితుల ప్రవేశం
Recommended image2
Mystery Temple: రాత్రయితే చాలు కాళీమాత విగ్రహం మాయమయ్యే ఆలయం, ఎందుకలా జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved