MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • రెండేళ్లపాటు వెంటబడి, వేధించి, యువతి హత్య... పట్టుకోబోయిన పోలీసులపై కాల్పులు...

రెండేళ్లపాటు వెంటబడి, వేధించి, యువతి హత్య... పట్టుకోబోయిన పోలీసులపై కాల్పులు...

యువతిని చంపిన ఓ నిందితుడు దీపక్ రాథోడ్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఓ పోలీసు గాయపడ్డాడు.

1 Min read
Author : Bukka Sumabala
Published : Apr 27 2023, 01:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ధార్ నగరంలోని నివాస ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఓ యువతిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. అతడు ఆ యువతిని గత రెండేళ్లుగా వేధిస్తున్నాడు. ఈ కేసులో అనుమానితుడిగా దీపక్ రాథోడ్ గా గుర్తించారు. అతను పూజా (22) అనే మహిళను గత రెండేళ్లుగా పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తూ, వెంబడిస్తున్నాడని, అయితే ఆమె అతనిని పదే పదే తిరస్కరించిందని పోలీసులు తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే... బాధితురాలైన యువతి ధార్‌లోని బ్రహ్మకుండ్‌లో తన తల్లి, ఇద్దరు సోదరీమణులతో కలిసి ఉంటోంది. ఆమె స్థానికంగా ఉన్న ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తోంది. ఉదయాన్నే పూజా, పనికి వెళుతుండగా రాథోడ్ ఎదురుపడి కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 

36

సాక్షులు అధికారులను అప్రమత్తం చేయడంతో రాథోడ్ కోసం గాలింపు చేపట్టారు. రాథోడ్‌ గత రెండేళ్లుగా పూజను వెంబడించిన చరిత్ర ఉందని.. ఆమె అతని వేధింపుల మీద కోర్టులో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడు ఆమె కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. 

46

అదేరోజు తెల్లవారుజామున పోలీసులు రాథోడ్‌ని బ్రహ్మకుండ్‌లోని అతని ఇంటి వద్ద గుర్తించారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అతను ప్రతిఘటించి అధికారులపై కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఒకరికి గాయాలయ్యాయి.

56

పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో రాథోడ్ కాలికి గాయమైంది. అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించారని రాథోడ్ ఇంటిని కూడా పోలీసులు కూల్చివేశారు. 

66

ఈ కూల్చివేతలో మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు. అతనిది అనధికార నిర్మాణమని చెబుతూ తొలగించారు. పూజను హత్య చేయడంతో సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి, ఆమెకు న్యాయం చేయాలని, రాథోడ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి. 

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
Recommended image2
Now Playing
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
Recommended image3
Now Playing
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved