ఇండిపెండెన్స్ డే ప్రత్యేక ఆకర్షణగా బంగ్లాదేశ్ను విముక్తి చేసి, శ్రీనగర్ను రక్షించిన వింటేజ్ డకోటా విమానాలు
ఆధునిక సూపర్ సొనిక్ యుద్ధ విమానాల ఉరుముల మధ్య, ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యేక లక్షణంగా డకోటా విమానాలతో కూడిన రుద్ర ఫ్లయింగ్ ఫార్మేషన్ కానుంది. ఇది రెండు రష్యన్-ఆధునిక ఎంఐ -17 హెలికాప్టర్లతో ఉంటుంది.1971 ఇండో-పాక్ యుద్ధంలో, బంగ్లాదేశ్ వైమానిక దళం ఏర్పడటంలో డకోటా కీలక పాత్ర పోషించింది. ఈ విమానాలను యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ టాంగైల్ లోని సైనికులకు ఎయిర్ డ్రాప్ కోసం ఉపయోగించేవారు.
వింటేజ్ డకోటా విమానం
భరతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే 1947-48 ఇండో-పాక్ వివాదంలో డకోటా కీలక పాత్ర పోషించింది. 26 అక్టోబర్ 1947న కాశ్మీర్ మహారాజా ప్రవేశ సాధనంపై సంతకం చేసినప్పుడు, పాకిస్తాన్ మద్దతు ఉన్న గిరిజన ఉగ్రవాదులు నగరం, విమానాశ్రయాన్ని ఆక్రమించకుండా కాపాడటానికి శ్రీనగర్లోకి సాయుధ దళాలను ప్రవేశపెట్టవలసిన అవసరం ఏర్పడింది.
1వ సిక్కు రెజిమెంట్ సైనికులతో కూడిన మొదటి మూడు డకోటాస్ 27 అక్టోబర్ 1947 న శ్రీనగర్లో ల్యాండ్ అయ్యింది. కొద్ది వారాల తరువాత మొత్తం ఇన్ఫాంట్రి బ్రిగేడ్ను శ్రీనగర్కు తరలించారు. పాకిస్థాన్పై భారత్ సాధించిన 50 సంవత్సరాల జ్ఞాపకార్థం తరువాత ఢీల్లీలోని రాజ్పథ్లో రిపబ్లిక్ డే కవాతులో పాల్గొనడానికి బంగ్లాదేశ్ సైన్యం యొక్క బృందాన్ని ప్రభుత్వం ఆహ్వానించింది. 122 మంది సభ్యుల బంగ్లాదేశ్ బృందం గత వారం ఢీల్లీ చేరుకొని కవాతు కోసం ప్రాక్టీస్ చేస్తోంది.
రిపబ్లిక్ డే దినోత్సవం రోజున ఎంఐ -171వి చాపర్స్ తో పాటు వింటేజ్ డకోటా విమానం భారతదేశ అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి అలాగే ప్రధానమంత్రి కూర్చున్న డైస్ మీదుగా ఎగురుతుంది.
ఈ వింటేజ్ ఎయిర్ క్రాఫ్ట్ 2011లో స్క్రాప్ నుండి తీసుకోబడింది. తరువాత దీనిని రాజ్యసభ ఎంపి, బిజెపి సీనియర్ నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ యునైటెడ్ కింగ్ డంలో దీనిని ఎగిరే కండిషన్ కి రిస్టోర్ చేశారు. తరువాత భారత వైమానిక దళానికి బహుమతిగా ఇచ్చారు.
2018లో ఐఏఎఫ్ దినోత్సవం సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ, "డకోటా తొలి ఫ్లై పాస్ట్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. భారత వైమానిక దళం చరిత్రలో ఇంకా జమ్ము అండ్ కాశ్మీర్ చరిత్రలో డకోటా ఒక ముఖ్యమైన భాగం." అని అన్నారు.
"ఈ విమానం పునరుద్ధరణకు 6 సంవత్సరాలు పట్టింది, ఇందుకు నాకు చాలా డబ్బు ఖర్చు అయ్యింది. కాని నేను ప్రధానంగా నా తండ్రి, దేశానికి సేవ చేసిన చాలా మంది నుండి ప్రేరణ పొందాను. 1947 లోని ఐఏఎఫ్, ఐఏఎఫ్ సైన్యం ధైర్యాన్ని దేశానికి గుర్తు చేయవలసిన అవసరం ఉంది, ఇది యువ స్వతంత్ర భారతదేశాన్ని జమ్మూ & కాశ్మీర్ తో కలిసి ఉండేలా చేసింది " అని చంద్రశేఖర్ చెప్పారు.
'పరశురామ్' గా పేరు మార్చబడిన డకోటాను మే 2018 లో ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్బేస్లోని 'వింటేజ్ ఫ్లై'లో చేర్చారు. ఇది 8 అక్టోబర్ 2018న ఎయిర్ ఫోర్స్ డే ఫ్లై పాస్ట్లో ఐఏఎఫ్ ఇతర సభ్యులతో కలిసి మొదటిసారి కనిపించింది. 1988 వరకు డకోటా విమానం ఐఏఎఫ్ లో పనిచేసింది.
విమాన ఫీచర్లను అభినందిస్తూ, అప్పటి ఐఏఎఫ్ చీఫ్ ఏసిఎం బిఎస్ ధనోవా 2018లో "ఇది 1930లలో ప్రవేశపెట్టబడ్డాయి. అప్పటి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఐఏఎఫ్ ) 12 వ స్క్వాడ్రన్ లో భాగంగా, డకోటాస్ లడఖ్, ఈశాన్య ప్రాంతంలో ప్రధాన వర్క్ హార్స్ గా ఉన్నాయి. 1947లో వారు కాశ్మీర్ లోయను కాపాడటానికి సకాలంలో జోక్యం చేసుకున్నారు.
గోల్డెన్ విక్టరీ ఇయర్
1971లో జరిగిన యుద్ధంలో అద్భుత విజయాన్ని సాధించినందుకు 2021 సంవత్సరాన్ని గోల్డెన్ విక్టరీ ఇయర్గా జరుపుకుంటామని భారత సైన్యం ఇప్పటికే ప్రకటించింది.
ఈ సంవత్సరం జనవరి 14న వెటరెన్ డే సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నారావణే మాట్లాడుతూ "1971లో జరిగిన యుద్ధానికి 50 ఏళ్ళు కావొస్తుంది. దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని కొంతమంది అనుభవజ్ఞులు నిరాశ వ్యక్తం చేశారు.
1971లో జరిగిన యుద్దంలో విజయానికి గుర్తుగా ఈ సంవత్సరాన్ని 'గోల్డెన్ విక్టరీ ఇయర్' గా జరుపుకొనున్నం. అలాగే దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. "