ఉత్తరాఖండ్ వరదలు : తపోవన్ సొరంగంలో సహాయక చర్యల పునరుద్ధరణ
ధౌలిగంగా నది ఉగ్రరూపం ఉత్తరాఖండ్ ఏర్పడ ఆకస్మిక వరదల్లో సహాయక చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. గల్లంతైన వారితో పాటు తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక దళాలు శ్రమిస్తున్నాయి.
ధౌలిగంగా నది ఉగ్రరూపం ఉత్తరాఖండ్ ఏర్పడ ఆకస్మిక వరదల్లో సహాయక చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. గల్లంతైన వారితో పాటు తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక దళాలు శ్రమిస్తున్నాయి.
సొంరంగంలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు భారీ యంత్రాలను రంగంలోకి దింపారు. ప్రత్యేక జాగిలాల బృందం ‘కెనైన్ స్క్వాడ్’ ను కూడా తెప్పించారు. నిన్న 16 మంది కార్మికులను ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించిన విషయం తెలిసిందే.
మరో 14 మంది మృతదేహాలను గుర్తించారు. మరికొంత మందిని రక్షించేందుకు ఈ రోజు తెల్లవారు జాము నుంచి ఎన్ఢీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సొరంగాల్లో భారీ స్థాయిలో మట్టి పూడుకుపోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది.
250 మీటర్ల పొడవున్న ఆ సొరంగంలోకి జవాన్లు ఆదివారం అతి కష్టం మీద 150 మీటర్ల వరకు వెళ్లగలిగారు. అయితే ఎవర ఆచూకీ వారికి లభించలేదు. మరోవైపు ధౌలీ గంగ నీటి మట్టం ఆదివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగించింది.
దీంతో రాత్రి రద్దు చేసిన సహాయక చర్యలు తిరిగి ఉదయం పునరుద్ధరించారు. మరో 30 మంది సొరంగాల్లో చిక్కకున్నట్లు తమకు సమాచారం ఉందని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే తెలిపారు. వీరందరినీ కాపాడేందుకు దాదాపు 300 మంది ఐటీబీపీ జవాన్లు శ్రమిస్తున్నట్లు వెల్లడించారు. ఒక సొరంగంలో ఉన్నవారిని ఆదివారమే సురక్షితంగా కాపాడామని.. మరో టన్నెల్ లో ఉన్నవారి కోసం వెతుకుతున్నామన్నారు.
అయితే, స్థానిక యంత్రాంగం మరో 170 మంది గల్లంతైనట్లు తెలిపిందన్నారు. తొలుత సొరంగంలో ఉన్నవారిని కాపాడడంపైనే దృష్టి సారించామన్నారు. ఉత్తరాఖండ్ లో ఆదివారం జలప్రళయం సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 170 మంది గల్లంతయ్యారు. కనీసం ఎనిమిది మంది మరణించారు. ఏకంగా ఓ జలవిద్యుత్కేంద్రం కొట్టుకుపోయింది. మరొకదానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లా జోషిమఠ్ సమీపంలో నందాదేవి హిమనీనదంలోని పెద్ద మంచు చరియలు విరగి ధౌలీగంగ నదిలో పడడంతో హఠాత్తుగా బారీ వరదలు సంభవంచాయి. అలకనంద, ధౌలీగంగ, రుషి గంగ నదుల మధ్య పరాంతో ఈ విపత్తు చోటు చేసకుంది. ఈ నది ఒడ్డున తపోవన్-రేణి వద్ద ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తపోవన్ -విష్ణుగద్ 480 మెగావాట్ ల జలవిద్యుత్ కేంద్రంలో కూడా నీరు ప్రవహించింది.
దీంతో అందులో పనిచేస్తున్న 170 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారని రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది. వారంత ప్రాణాలు కోల్పోయి ఉంటాన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.