నలుగురు యువకులు, ఓ యువతి మధ్య లవ్: లక్కీ డ్రా తీసి పెళ్లి
నలుగురు యువకులు, ఓ యువతి మధ్య ప్రేమాయణం యూపీ రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. నలుగురిని ప్రేమించినట్టుగా యువతి చెప్పింది. అయితే ఒక్కరితోనే పెళ్లి చేసేందుకు గ్రామస్తులు అష్టకష్టాలు పడ్డారు.
నలుగురు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. అయితే ఈ నలుగురిని కూడ ఆ అమ్మాయి కూడా నిరాశపర్చలేదు. మూడు రోజులపాటు చర్చోపచర్చలు జరిగిన తర్వాత లక్కీ డ్రా నిర్వహించి ఒక్క అబ్బాయితో ఆమెకు వివాహం చేశారు.ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు అబ్బాయిలు నివసిస్తున్నారు.
ఈ నలుగురు అబ్బాయిలు తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ అమ్మాయిని ప్రేమించారు. ఈ నలుగురిని కూడ ఆ అమ్మాయి నిరాశపర్చలేదు. ఆ నలుగురిని ప్రేమించింది.
ఈ నలుగురు ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం చివరకు అందరికి తెలిసిపోయింది. దీంతో ఈ నలుగురు అబ్బాయిలు ఈ అమ్మాయిని పక్కనే మరో ఊరిలో దాచిపెట్టారు.
ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులకు తెలిసింది. దీంతో ఈ నలుగురి అబ్బాయిల్లో ఎవరితోనైనా ఒకరికిచ్చి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని గ్రామస్తులు అమ్మాయి కుటుంబసభ్యులను ఒప్పించారు.
పక్క ఊరిలో ఉన్న అమ్మాయిని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అబ్బాయిలను కూడా రప్పించారు. ఈ నలుగురిలో ఎవరంటే నీకు ఇష్టమని ఆ అమ్మాయిని అడిగారు. అయితే ఆ అమ్మాయి కూడా నలుగురు ఇష్టమేనని చెప్పింది.
నలుగురు అబ్బాయిలు కూడ ఎవరో ఒకరు ఆ ఆమ్మాయిని పెళ్లి చేసుకోవాలని.. ముగ్గురు త్యాగం చేయాలని గ్రామస్తులు కోరారు.
అయితే ఈ విషయమై నలుగురిలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఏం చేయాలో గ్రామస్థులకు అర్ధం కాలేదు. లక్కీ డ్రా తీయడమే మార్గమని గ్రామస్థులు ఓ నిర్ణయానికి వచ్చారు.
వెంటనే నలుగురు అబ్బాయిల పేర్లు, అమ్మాయి పేరు రాసి లక్కీ డ్రా తీశారు. ఈ డ్రాలో వచ్చిన అబ్బాయితో అమ్మాయి వివాహం చేశారు.