MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన వార్తలు ఇవి

Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన వార్తలు ఇవి

Today Top 5 News : మీరు ఇవాళ్టి టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, నేషనల్ , ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ లో టాప్ 5 వార్తలు ఇక్కడ అందిస్తున్నాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 16 2025, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణలో ఎరువుల కొరత ఎందుకొచ్చింది?
Image Credit : our own

తెలంగాణలో ఎరువుల కొరత ఎందుకొచ్చింది?

తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా మారింది. వానలో తడుస్తూ రైతులు క్యూలైన్లలో నిలబడ్డా ఒకటి రెండు బస్తాలే దొరుకుతున్నాయి. చాలా మంది రైతులకు ఆవి కూడా దొరకడం లేదు. ఎరువుల షాపుల ముందు పరిస్థితి అదుపులో లేక పోలీస్ స్టేషన్లలోనే పంపిణీ జరగడం, లారీలను అడ్డుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 

ఈ సమస్యపై రాజకీయ దుమారం మంటోంది. కేంద్రం సరిపడా యూరియా ఇచ్చామని చెబుతుండగా, రాష్ట్రం మాత్రం సరఫరా తగ్గిందని ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ అయితే బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది.  రైతులు మాత్రం అధికార కాంగ్రెస్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పాలకుల వైఫల్యం వల్లే ఈ కష్టాలు ఎదురవుతున్నాయని అంటున్నారు. 

తెలంగాణలో ఎరువుల కొరత కారణం ఏమిటి? ఇక్కడ చదవండి

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఏపీ హైకోర్టుపై సుప్రీంకోర్టు అసహనం
Image Credit : ANI

ఏపీ హైకోర్టుపై సుప్రీంకోర్టు అసహనం

ఏసీబీ విజయవాడ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌లో నమోదైన కేసులను ఏకపక్షంగా రద్దు చేసిన ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం, దర్యాప్తు పరిస్థితిని పరిశీలించకుండానే కేసులు రద్దు చేయడం పై ప్రశ్నలను లేవనెత్తింది.  రాష్ట్ర విభజన తర్వాత కూడా యూనిట్‌కు విజయవాడ కేంద్రంగా పూర్తిస్థాయి అధికారాలు ఉన్నాయని, ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాదులు వివరించారు. ఇదే విధంగా పూర్వవిజయం పంజాబ్, బిహార్ విభజన కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు సూచిస్తున్నాయని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, తదుపరి విచారణ ఆరు వారాలు వాయిదా వేయించింది.

Related Articles

Related image1
టీమిండియా కొత్త స్పాన్సర్ గా అపోలో టైర్స్.. ఎన్ని కోట్లో తెలుసా?
Related image2
రైలు టిక్కెట్ బుక్ చేస్తున్నారా.. రూల్స్ మారాయి.. ఏంటో తెలుసా?
35
16వేల మంది విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
Image Credit : X/Narendra Modi

16వేల మంది విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం

16,000 మంది విదేశీయులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటోంది కేంద్రం. ఇటీవల అమల్లోకి వచ్చిన 2025 వలస చట్టాల ప్రకారం, నార్కోటిక్స్ రవాణా, ఇతర నేరాలకు సంబంధించినవారిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అదుపులోకి తీసుకున్నది. 

హోం శాఖ (MHA) నిర్బంధ కేంద్రాల్లో ఉన్న వారిని వదిలించకుండా, Deportation కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సెప్టెంబర్ 2న అమలైన కొత్త చట్టం అక్రమ వలస, ఫోర్జరీ పత్రాలతో  భారత్  లో ఉన్న విదేశీయులకు కఠిన శిక్షలు విధిస్తుంది. దీనిలో కనీసం 2 సంవత్సరాల నుంచి గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.

45
న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ రూ. .1.32 లక్షల కోట్ల దావా
Image Credit : Getty

న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ రూ. .1.32 లక్షల కోట్ల దావా

చాలా కాలం నుంచి న్యూయార్క్ టైమ్స్ తనపై దుమ్మెత్తిపోతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తన సంబంధాలపై పత్రిక వరుస కథనాలు ప్రచురించడాన్ని వ్యతిరేకిస్తూ, రూ.1.32 లక్షల కోట్ల విలువైన దావా వేయబోతున్నారని ప్రకటించారు. 

ట్రంప్, తన, కుటుంబం, వ్యాపారాలు, అమెరికాపై న్యూయార్క్ టైమ్స్ అసత్య ప్రచారాలను  చేస్తోందని, ఫ్లోరిడాలో దావా చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆయన ఈ పత్రికను దేశంలో చెత్త, వార్తాపత్రికగా, రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ పార్టీకు వర్చువల్ మౌత్‌పీస్‌గా మారిందని విమర్శించారు.

55
టీమిండియా కొత్త స్పాన్సర్ గా అపోలో టైర్స్
Image Credit : Insta/indiancricketteam

టీమిండియా కొత్త స్పాన్సర్ గా అపోలో టైర్స్

భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ ఎంపికైంది. రూ.579 కోట్ల విలువైన ఈ ఒప్పందం మూడు సంవత్సరాలపాటు అమలులో ఉంటుంది. మొత్తం 121 ద్వైపాక్షిక మ్యాచ్‌లు, 21 ఐసీసీ మ్యాచ్‌లు ఇందులో కవర్ అవుతాయి.

ప్రభుత్వం ఆన్‌లైన్ మనీ గేమింగ్ కంపెనీలపై నిషేధం విధించిన తర్వాత డ్రీమ్11తో ఒప్పందం రద్దయింది. ఆసియా కప్ 2025లో జట్టు జెర్సీపై ఎలాంటి స్పాన్సర్ లేకుండానే భారత్ ఆడాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ సెప్టెంబర్ 2న టెండర్లు ఆహ్వానించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రోజు వారీ ప్రధాన వార్తలు
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
క్రీడలు
క్రికెట్
నారా చంద్రబాబు నాయుడు
అనుముల రేవంత్ రెడ్డి
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Beers Price Drop : తెలుగోళ్లకూ కిక్కిచ్చే న్యూస్.. రూ.185 బీర్ ధర రూ.110 కి తగ్గిందోచ్..! మందుబాబులకు పండగే
Recommended image2
Now Playing
Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Recommended image3
Now Playing
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Related Stories
Recommended image1
టీమిండియా కొత్త స్పాన్సర్ గా అపోలో టైర్స్.. ఎన్ని కోట్లో తెలుసా?
Recommended image2
రైలు టిక్కెట్ బుక్ చేస్తున్నారా.. రూల్స్ మారాయి.. ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved