‘చిన్నపిల్లలు ఎందుకు అంతలా కష్టపడాలి మోడీజీ’... ప్రధానికి ఆరేళ్ల చిన్నారి ప్రశ్న
కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రపంచవ్యాప్తంగా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రోజువారీ దినచర్యలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ లాక్ డౌన్, కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రపంచవ్యాప్తంగా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రోజువారీ దినచర్యలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ లాక్ డౌన్, కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు బైటికి వెళ్లి స్వేచ్ఛగా ఆడుకోలేక, ఆన్ లైన్ క్లాసుల్లో చెప్పేది సరిగా బుర్రకు ఎక్కక.. ఆ క్లాసు తలనొప్పిని భరించలేక ఇబ్బంది పడుతున్నారు.
జమ్ము కాశ్మీర్ లోనూ ఓ ఆరేళ్ల చిన్నారికి ఆన్ లైన్ క్లాసులతో తీవ్రంగా ఇబ్బంది వచ్చింది. అయితే ఆ చిన్నారి దీన్ని అక్కడితో వదిలేయదలుచుకోలేదు. ఎలాగైనా ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లాలనుకుంది.
అంతే ఓ ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఓ వీడియో రెడీ చేసింది. దీన్ని ఔరంగజేబు నక్షబండి అనే జర్నలిస్ట్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘నరేంద్ర మోడీకి ఆరేళ్ల కాశ్మీరీ చిన్నారి ఫిర్యాదు’ అనే పేరుతో పోస్ట్ చేశాడు. ఎడతెగని ఆన్ లైన్ క్లాసులు, క్లాస్ వర్కులు మీద అంటూ ట్యాగ్లైన్ ఇచ్చాడు.
45 సెకన్ల ఈ క్లిప్లో, ఆ చిన్నారి తన తరగతులు ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతాయని చెప్పుకొచ్చింది.
"వీటిలో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఉర్దూ మరియు ఈవిఎస్ ఉన్నాయి. ఆపై కంప్యూటర్ క్లాస్ కూడా ఉంది" అని ఎంతో క్యూట్ గా కంప్టైంట్ చేసింది.
చిన్న పిల్లలకు ఇంత చదువా.. ఇంత పనా అంటూ ముద్దుగా చేతులు తిప్పుతూ, కళ్లు తిప్పుతూ ప్రశ్నించడం ఆ చిన్నారి ఆన్ లైన్ క్లాసుల్లో ఎదుర్కొంటున్న ఒత్తిడిని చూపిస్తుంది.
చివరగా ‘మోడీ సాహబ్, చిన్న పిల్లలు ఎందుకు ఇంత కష్టపడాలి? అని ప్రశ్నించింది. ఆ తర్వాత కొన్ని సెకన్ల నిశ్శబ్దం తరువాత, "ఇంకేం చేయాలి? అస్సలాములైకం, మోడీ సాహబ్, బై." అంటూ వీడియో ఎండ్ అవుతంది.
శనివారం ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ క్లిప్కు 57,000 వ్యూస్, 5,000 లైక్లు వచ్చాయి. అంతే కాదు, దాదాపు 1,200 మంది వినియోగదారులు ఈ వీడియోను రీట్వీట్ చేశారు. చాలా మంది ఆమె ఫిర్యాదుపై స్పందించారు.
ఎంత క్యూట్ గా ఉన్నావ్ చిట్టితల్లి అని ఒకరంటే.. మోడీ గారూ వింటున్నారా.. ఎంతోమంది చిన్నారుల ప్రతినిథిలా మాట్లాడుతున్న ఈ చిన్నారి మాటలు.. ఇప్పటికైనా ఆన్ లైన్ క్లాసుల బాధనుంచి వారికి విముక్తి కల్పించండి.. అని మరొకరు అన్నారు.
చిన్నారులపై ఈ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపించదని ఒకరు, చదువు పిల్లలను ఉత్సాహంగా చేయాలి.. కానీ ఈ చిన్నారి పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందని మరొకరు స్పందించారు.
ఈ చిన్నారి లేవనెత్తిన ప్రశ్నలు నిజానికి చట్టబద్ధమైనవని కొందరు అంగీకరించారు. వీటిని తప్పక పరిశీలించాలని అన్నారు.
ఇక దేశ వ్యాప్తంగా సోమవారం 50 రోజుల్లో రోజువారీ COVID-19 కేసులలో అత్యల్ప పెరుగుదలను నమోదు చేసింది. గత 24 గంటల్లో కనీసం 3,218 మంది మరణించారు, మొత్తం మరణాల సంఖ్య 3.29 లక్షలకు చేరుకుంది.