MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మోదీ దీపావళి సందేశం.. ఇకపై అమెరికాకు ఇత్తడే!!

మోదీ దీపావళి సందేశం.. ఇకపై అమెరికాకు ఇత్తడే!!

Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి సందేశంతో అమెరికాకు షాక్ ఇచ్చారు. పదేపదే భారత్ ను టార్గెట్ గా చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు మోదీ. 

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 21 2025, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రధాని మోదీ దీపావళి సందేశం
Image Credit : X/PMO

ప్రధాని మోదీ దీపావళి సందేశం

Narendra Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి పండగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు, గత సంవత్సరకాలంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించడమే కాదు ఇకపై ప్రతి భారత పౌరుడు ఏం చేయాలో సూచించారు. ఇలా పీఎం మోదీ దీపావళి సందేశం ఆసక్తికర అంశాలను కలిగివుంది.

25
ప్రధాని మోదీ స్వదేశీ మంత్రం..
Image Credit : ANI

ప్రధాని మోదీ స్వదేశీ మంత్రం..

ప్రధానమంత్రి మోదీ దీపావళి సందర్భంగా ప్రజల్లో స్వదేశీ భావనను పెంపొందించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే 'వికసిత్ భారత్', 'ఆత్మనిర్భర్ భారత్' అంశాలను ప్రస్తావించారు... ఈ దిశగా దేశం ముందుకు సాగేందుకు ప్రతి పౌరుడు భాద్యత తీసుకోవాలన్నారు. ప్రాథమిక బాధ్యతలను గుర్తించి సక్రమంగా నిర్వర్తించినపుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందుకే ఇకపై మనం 'స్వదేశీ గూడ్స్' (స్థానిక వస్తువులు) వాడుతూ గర్వంగా 'ఇదీ నా దేశంపై ప్రేమ!'' అని చెప్పుకోవాలన్నారు. 'ఏక్ భారత్, శ్రేష్ట భారత్' (ఒకే దేశం-బలమైన దేశం) నిర్మించాలని ప్రధాని మోదీ సూచించారు.

ఇక దేశప్రజలు ప్రాంతాలు, బాషల పరంగా విడిపోరాదని.. దేశంలోని అన్ని బాషలను గౌరవిద్దామన్నారు మోదీ. అలాగే ప్రతిఒక్కరం పరిశుభ్రతను పాటిద్దాం... మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మంచి ఆరోగ్యం కోసం వంటకాల్లో 10 శాతం ఆయిల్ వాడకాన్ని తగ్గించాలని.. యోగా చేయాలని సూచించారు. ఇలాంటి చర్యలు దేశాన్ని వికసిత్ భారత్ దిశగా మరింత వేగంగా తీసుకెళతాయని ప్రధాని మోదీ అన్నారు.

Related Articles

Related image1
GST Reforms : ఏంటి భయ్యా... ఒక్కరోజులో 30,000 కార్లు అమ్మేశారా..!
Related image2
Diwali 2025: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళికి ఇంట్లో ఎక్కడెక్కడ దీపాలు పెట్టాలంటే...
35
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్
Image Credit : Getty

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్

దీపావళి అనేది వెలుగుల పండగ.. ఓ దీపంతో మరో దీపాన్ని వెలుగిస్తూ అంధకారాన్ని తొలగిస్తుంది. ఇదే స్పూర్తితో మనంకూడా సామరస్యంతో ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా పాజిటివ్ పద్దతిలో సమాజాన్ని నిర్మించాలన్నారు పీఎం మోదీ. ఇలా ఈ దీపావళి పండగ నుండి సరికొత్త వెలుగులు పంచాలన్నారు. ఈ పండగ అందరి జీవితాల్లో కొత్త శక్తిని, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని ప్రధాని తెలిపారు.

ప్రస్తుతం యావత్ ప్రపంచం చాలా సమస్యలను ఎదుర్కొంటోంది... కానీ భారతదేశం చాలా స్థిరత్వంతో ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. అందువల్లే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడోస్థానం కోసం ముందుకు సాగుతోంది... ఈ ప్రయాణం సరైన దారిలోనే సాగుతోందన్నారు.

45
ఆపరేషన్ సిందూర్ పై పీఎం ఆసక్తికర కామెంట్స్
Image Credit : ANI

ఆపరేషన్ సిందూర్ పై పీఎం ఆసక్తికర కామెంట్స్

దీపావళి సందర్భంగా దేశ ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు పీఎం. అయోధ్యలో రామమందిరం నిర్మించిన తర్వాత ఇది రెండో దీపావళి అని గుర్తుచేశారు. ఆ శ్రీరాముడు మనకు ధర్మం వైపు నిలవాలని... అధర్మంపై పోరాటం చేయాలని బోధించారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో మనం ఇదే చేశామని... భారత్ కేవలం ధర్మం వైపు నిలవడమే కాదు అధర్మానికి వ్యతిరేకంగా పోరాడిందన్నారు ప్రధాని.

ఈ దీపావళి చాలా ప్రత్యేకమైనది... దేశవ్యాప్తంగా అనేక జిల్లాలు, మారుమూల ప్రాంతాల్లో వెలుగులు నిండాయన్నారు. నక్సలిజం బలంగా ఉన్న ప్రాంతాల్లో మావోయిస్ట్ టెర్రరిజాన్ని కూకటివేళ్లతో పెకిలించివేశామన్నారు. ఇటీవల చాలామంది హింసను వీడిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని తెలిపారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య పాలనపై నమ్మకంతోనే ఇది సాధ్యమయ్యిందని.. దేశం సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటన్నారు.

55
ప్రజల వేలకోట్లు ఆదా చేశాం.. మోదీ
Image Credit : ANI

ప్రజల వేలకోట్లు ఆదా చేశాం.. మోదీ

కేంద్ర ప్రభుత్వం దేశ భవిష్యత్ ను మార్చే నిర్ణయం తీసుకుంది... అదే జిఎస్టి సంస్కరణలు. దసరా నవరాత్రుల ప్రారంభంరోజే కొత్త జిఎస్టి ధరలు అమల్లోకి వచ్చాయన్నారు నరేంద్ర మోదీ. ఈ దీపావళి పండటపూట కూడా 'జిఎస్టి బచత్ ఉత్సవ్' (సేవింగ్ ఫెస్టివల్) లో ప్రజలు వేలకోట్లు ఆదా చేసుకున్నారని అన్నారు. ఇలా అనేక అంశాలను తన దీపావళి సందేశంలో పేర్కొన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నరేంద్ర మోదీ
దీపావళి
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
సంస్కృతి (Samskruti)

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లికి అడ్డొచ్చిన జాత‌కం, శారీర‌కంగా క‌ల‌వ‌డానికి రాలేదా.? హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image2
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Recommended image3
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Related Stories
Recommended image1
GST Reforms : ఏంటి భయ్యా... ఒక్కరోజులో 30,000 కార్లు అమ్మేశారా..!
Recommended image2
Diwali 2025: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళికి ఇంట్లో ఎక్కడెక్కడ దీపాలు పెట్టాలంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved