MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ముంబై ప‌డ‌వ ప్ర‌మాదంలో 13 మంది మృతి.. ఎలా జరిగిందంటే?

ముంబై ప‌డ‌వ ప్ర‌మాదంలో 13 మంది మృతి.. ఎలా జరిగిందంటే?

Mumbai Boat Accident: ముంబైలోని ఎలిఫెంటా ప్రాంతంలో బుధవారం సాయంత్రం ప్రయాణీకుల పడవ మునిగిపోయింది. స‌హాయ చ‌ర్య‌ల కోసం నేవీ, ముంబై పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. 

2 Min read
Mahesh Rajamoni
Published : Dec 18 2024, 09:59 PM IST| Updated : Dec 18 2024, 11:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Mumbai boat accident

Mumbai boat accident

Mumbai Boat Accident: ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధృవీకరించారు. మృతుల్లో 10 మంది పౌరులు, ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారు. బుచర్ ఐలాండ్ సమీపంలో మధ్యాహ్నం 3:55 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నీల్కమల్ అనే ప్రయాణీకుల నౌకను నేవీ బోటు ఢీకొట్టింది . రాత్రి 7:30 గంటలకు 101 మంది సురక్షితంగా బయటపడ్డారు.

24

ముంబైలోని ఎలిఫెంటా ప్రాంతంలో బుధవారం సాయంత్రం ప్రయాణీకుల పడవ మునిగిపోయింది. స‌హాయ చ‌ర్య‌ల కోసం నేవీ, ముంబై పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు నేవీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యల్లో 11 క్రాఫ్ట్‌లు, నాలుగు హెలికాప్టర్లతో నేవీ, కోస్ట్ గార్డ్, పోలీసులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు.

 

34

తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించిన తుది సమాచారం మరుసటి రోజు ఉదయానికి అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు. ముఖ్యమంత్రి బాధితులకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షలు ఇస్తామ‌ని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు, నేవీ సమగ్ర విచారణ చేపట్టనున్నాయ‌ని కూడా వెల్లడించారు. 

44
Boat

Boat

ఫెర్రీ మరో బోటును ఢీకొట్టిందా?

ముంబైకి సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన 'ఎలిఫెంటా' దీవికి బోటు వెళ్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో స్పీడ్ బోట్ ఢీకొట్టిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. స్పీడ్ బోట్ నేవీకి చెందినదని స్థానిక నేత ఒకరు పేర్కొన్నారు. 

నేవీ నివేదిక ప్రకారం, సాయంత్రం 4 గంటలకు, ఇంజన్ ట్రయల్స్ సమయంలో ఓడ నియంత్రణ కోల్పోయి ముంబైలోని కరంజా సమీపంలో ప్రయాణీకుల ఫెర్రీ నీల్ కమల్‌ను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. ఫెర్రీ గేట్ వే ఆఫ్ ఇండియా, ఎలిఫెంటా ద్వీపం మధ్య ప్రయాణికులతో న‌డుస్తోంది. "ఈ ప్రాంతంలో నేవీ, సివిల్ క్రాఫ్ట్ చేత ప్రాణాలతో బయటపడిన వారిని సమీపంలోని జెట్టీలు, ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటివరకు 99 మంది ప్రాణాలతో రక్షించబడ్డారు" అని నేవీ అధికారి ధృవీకరించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Recommended image2
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Recommended image3
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved