MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు కెనడా నుంచి వచ్చి.. అతని చేతిలోనే హతమై, యేడాది తర్వాత అస్తిపంజరంగా..

ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు కెనడా నుంచి వచ్చి.. అతని చేతిలోనే హతమై, యేడాది తర్వాత అస్తిపంజరంగా..

గత ఏడాది జూన్‌లో ఆమె అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయగా, ఆమె అస్థిపంజరాన్ని మంగళవారం ప్రియుడి పొలంలో కనుగొన్నారు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Apr 06 2023, 08:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హర్యానా : కెనడాలో పనిచేస్తున్న ఓ మహిళ తన ప్రియుడితో కలిసి ఉండేందుకు గతేడాది భారత్‌కు వచ్చింది. కానీ ఆ తరువాత ఆచూకీ లేకుండా పోయింది. ఆమెను ప్రియుడే కాల్చి చంపి తన పొలంలోనే పాతిపెట్టాడు. ఈ దారుణ హత్య ఘటన హర్యానాలోని గుమాడ్ గ్రామంలో వెలుగు చూసింది. నిరుడు జూన్‌లో ఆమె అదృశ్యమైనట్లు ఆమె ఆంటీ ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేస్తున్న భివానీ పోలీసులు మంగళవారం ఆమె అస్థిపంజరాన్ని కనుగొన్నారు.

25

ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిందితుడు సునీల్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. గతేడాది జూన్‌లో 23 ఏళ్ల నీలమ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు వారు తెలిపారు. అతను ఆమె తలపై రెండుసార్లు కాల్చి, ఆపై సాక్ష్యాలను నాశనం చేయడానికి ఆమె మృతదేహాన్ని తన పొలంలో పాతిపెట్టాడని సిఐఎ భివానీ ఇన్‌ఛార్జ్ రవీంద్ర తెలిపారు.

నీలం సోదరి రోష్ని జూన్‌లో గన్నౌర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోహ్‌తక్‌లోని బలాండ్ గ్రామానికి చెందిన తన సోదరి ఐఈఎల్‌టీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగం కోసం కెనడాకు వెళ్లిందని ఆమె చెప్పారు. నిరుడు జనవరిలో సునీల్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు భారత్‌కు రప్పించి, ఆమెను కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

35

నీలం సోదరి రోష్ని జూన్‌లో గన్నౌర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోహ్‌తక్‌లోని బలాండ్ గ్రామానికి చెందిన తన సోదరి ఐఈఎల్‌టీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగం కోసం కెనడాకు వెళ్లిందని ఆమె చెప్పారు. నిరుడు జనవరిలో సునీల్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు భారత్‌కు రప్పించి, ఆమెను కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

45
crime

crime

గ్రామంలోని నీలమ్ కుటుంబానికి ఆమె తిరిగి వచ్చినట్టుగా కూడా తెలియదు. ఆ తరువాత ఆమె వచ్చినసంగతి తెలిసినా.. ఆమె ఎక్కడుందో తెలియలేదు. అదే రోజు నుండి సునీల్ కూడా కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. పోలీసులు కిడ్నాప్‌గా కేసు నమోదు చేయగా, ఫిర్యాదు చేసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు.

నీలమ్ కోసం తాము ఎంతగా వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె కుటుంబం హర్యానా హోం మంత్రి అనిల్ విజ్‌ను కలిసింది. ఆయన చొరవతోకేసును భివానీలోని సీఐఏకి బదిలీ చేశారు, చివరకు సునీల్‌ను అరెస్టు చేశారు.
 

55

కస్టడీలో ఉన్న సునీల్ సమాచారం ఆధారంగా, గార్హి రోడ్‌లోని అతని పొలంలో 10 అడుగుల లోతులో నీలమ్ అస్థిపంజర అవశేషాలను అధికారులు తవ్వి తీశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సోనిపట్ సివిల్ హాస్పిటల్‌కు పంపారు, అక్కడ వారు ఆమె తల్లితో డీఎన్ఏ పరీక్షను కూడా నిర్వహిస్తారు. సునీల్‌పై హత్య, అక్రమ పిస్టల్స్ కలిగి ఉన్న అరడజనుకు పైగా కేసులు సహా నేర కార్యకలాపాల చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2: ధురంధర్ 2లో రణ్‌వీర్ కంటే మోదీ క్రేజే ఎక్కువ.. అసలు ఆ సీన్ల వెనుక కథేంటి?
Recommended image2
ఒక్క మాటతో సగానికి తగ్గిన హాస్పిటల్ బిల్లు.. అసలు ట్రిక్ ఇదే
Recommended image3
ఏమిటీ.. తీర్థయాత్రకు వెళితే లక్ష రూపాయలు ఇస్తారా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved