MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • kerala Wayanad Landslides: వయనాడ్‌ విలయం: 293కి పెరిగిన మృతుల సంఖ్య.. 240 మంది మిస్సింగ్‌

kerala Wayanad Landslides: వయనాడ్‌ విలయం: 293కి పెరిగిన మృతుల సంఖ్య.. 240 మంది మిస్సింగ్‌

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటన మరింత విషాదకరంగా మారుతోంది. గంటగంటలకు మృతుల సంఖ్య పెరిగిపోతోంది. మూడు రోజులు దాటినా ఇంకా 240 మంది జాడ తేలియ రాలేదు. 

2 Min read
Author : Galam Venkata Rao
Published : Aug 02 2024, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే 293 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా 240 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని సమాచారం. 1,700 మంది సహాయక శిబిరాల్లో ఉన్నారు. గురువారం నిర్వహించిన సహాయక చర్యల్లో 40 మృతదేహాలను బలగాలు వెలికితీశాయి. శుక్రవారం కూడా విపత్తు ప్రాంతంలో సోదాలు, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ చర్యలను ఆరు జోన్లుగా విభజించి... గల్లంతైన వారి కోసం శోధిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Bailey bridge

Bailey bridge

రెండు రోజులు తీవ్రంగా శ్రమించిన అనంతరం బెయిలీ వంతెన నిర్మాణాన్ని సైన్యం పూర్తిచేసింది. వరద ప్రభావిత ప్రాంతానికి వాహనాలు, అంబులెన్స్‌లు ఈ బెయిలీ వంతెన మీదుగానే వెళ్తున్నాయి. చలియార్ నదికి 40 కిలోమీటర్ల పరిధిలో కూడా సైన్యం, విపత్తు నిర్వహణ బృందాలు అన్వేషణ చేపట్టనున్నాయి.

35

మరోవైపు, వయనాడ్ విపత్తులో గల్లంతైన వారి కోసం నదిలో వెదకడానికి డైవర్ల సహాయం కోరుతున్నారు అధికారులు. వయనాడ్ విపత్తులో ఇరవహింజి పుజా, చలియార్‌లలో గల్లంతయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

45
kerala landslide

kerala landslide

ముక్కం, కోటంచెరి, తిరువంబాడి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు రోజుల పాటు నదిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం డైవింగ్ నిపుణుల సాయం కోరుతూ పోలీసులు రంగంలోకి దిగారు. అలా చేయాలనుకునే వారు ముక్కం, కోటంచెరి, తిరువంబాడి పోలీస్ స్టేషన్లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు. 94979 90122 నంబరును సంప్రదిస్తే అవసరమైన సహాయ సహకారాలు పోలీసులు అందిస్తారని చెప్పారు.

55

కాగా, కేరళలో నేడు, రేపు (ఆగస్టు 02, 03 తేదీల్లో) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ తీరం నుంచి దక్షిణ గుజరాత్ తీరం వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌పై కూడా అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగస్టు 02, 03 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. 

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
Recommended image2
Now Playing
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu
Recommended image3
Now Playing
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved