MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Operation Sindhoor: పాక్ పై భారత్ ఎంత భీకరంగా దాడి చేసిందంటే

Operation Sindhoor: పాక్ పై భారత్ ఎంత భీకరంగా దాడి చేసిందంటే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్రస్థలాలపై మిసైల్ దాడులు జరిపిన భారత సైన్యం.

1 Min read
Author : Bhavana Thota
Published : May 07 2025, 04:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
‘ఆపరేషన్ సింధూర్’

‘ఆపరేషన్ సింధూర్’

పహల్గాం ఉగ్రదాడి ఘటనకి రెండు వారాల తర్వాత, భారత భద్రతా దళాలు పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని (పీఓకే) తొమ్మిది ఉగ్రస్థలాలపై బుధవారం తెల్లవారుజామున మిసైల్ దాడులు నిర్వహించాయి. ఈ దాడులకు భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టింది.

25
ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా..

ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా..

ఇండియన్ ఆర్మీ ఉదయం 1.44 గంటలకు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలు, అలాగే పీఓకే నుంచి భారత్‌పై ఉగ్రదాడులు నిర్వహించేందుకు ఉపయోగిస్తున్న బేస్‌లను ఈ ఆపరేషన్‌లో లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.

35
ఓ పద్దతిగా ముందుకు

ఓ పద్దతిగా ముందుకు

ఈ దాడుల్లో ఎలాంటి పాకిస్తాన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా చేయలేదని, టార్గెట్లు ఎంపికలో ఎంతో స్థిరత్వంతో, నిఖార్సైన పద్ధతిలో ముందుకు వెళ్లామని భారత ఆర్మీ స్పష్టం చేసింది.

45
పహల్గాం దాడికి ప్రతీకారంగానే

పహల్గాం దాడికి ప్రతీకారంగానే

ఈ దాడులు ఇటీవల పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగాయి. ఆ దాడిలో 25 మంది, అందులో చాలా మంది పర్యాటకులే, ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.

55
Agniveer recruitment

Agniveer recruitment

ఆపరేషన్ సింధూర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు, దాని ప్రభావం, తదనంతర చర్యలపై భారత సైన్యం త్వరలో విస్తృతంగా వివరించనుంది. ఉదయం నుంచే ఆ వివరాలపై మీడియా అప్రమత్తంగా ఉంది.ఈ దాడులతో పాటు భారత ప్రభుత్వం భద్రతా వ్యవస్థను మరింత బలపర్చాలని చూస్తోంది. ఉగ్రవాదంపై నిష్కర్షమైన పోరాటాన్ని కొనసాగిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇటువంటి ఆపరేషన్లు పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలుగా మారే అవకాశముంది. పీఓకే ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలకు ఇది గట్టి దెబ్బగా భావిస్తున్నారు.

భారత సైన్యం కూలంకషంగా, వ్యూహాత్మకంగా ముందుకు సాగిన ఈ ఆపరేషన్ దేశ భద్రతపై ఉన్న నిబద్ధతకు ఉదాహరణగా నిలిచింది.

ఇలాంటి చర్యలు దేశ ప్రజల్లో భద్రతాపట్ల నమ్మకాన్ని పెంచేలా చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇంకా ఓ అధికారిక బులిటెన్ ద్వారా పూర్తి వివరాలు అందనున్నందున, ఆపరేషన్ సింధూర్పై మరిన్ని సమాచారం కోసం అధికారిక వర్గాల ప్రకటనకే ఎదురుచూడాల్సి ఉంటుంది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Recommended image2
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Recommended image3
గ్రామాల రూపురేఖలే మారిపోతున్నాయి.. రూరల్ ఎకానమీ దిశగా కీలక ముందుడుగు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved