MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • రాహుల్ కి షాక్.. ఇండియా కూటమిలో చీలిక.. బిహార్ ఫలితాలతో టీఎంసీ కీలక డిమాండ్!

రాహుల్ కి షాక్.. ఇండియా కూటమిలో చీలిక.. బిహార్ ఫలితాలతో టీఎంసీ కీలక డిమాండ్!

బిహార్ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఘోర పరాజయం పాలైంది. మోదీ-నితీశ్ దెబ్బకు మహాఘట్ బంధన్ ఛిన్నాభిన్నమైంది. ఈ నేపథ్యంలో టీఎంసీ రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చింది. 

1 Min read
Kavitha G
Published : Nov 17 2025, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాహుల్ ని పక్కన పెట్టి..
Image Credit : Asianet News

రాహుల్ ని పక్కన పెట్టి..

బిహార్ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్, ఆర్జేడీ పరువు కాపాడుకోలేకపోయాయి. మోదీ-నితీశ్ ప్రభంజనంతో విపక్ష కూటమి చిన్నాభిన్నమైంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ అయోమయంలో పడ్డారు. అంతేకాదు, ఇండియా కూటమిలోనూ విభేదాలు మొదలయ్యాయి. రాహుల్ గాంధీని తొలగించాలనే డిమాండ్ కూటమిలోనే మొదలైంది. అయితే, అక్కడ కూడా వివాదం కొనసాగుతోంది.

25
TMC vs SP
Image Credit : SOCIAL MEDIA

TMC vs SP

రాహుల్ గాంధీని పక్కనపెట్టి, మమతా బెనర్జీని ఇండియా కూటమికి నాయకురాలిగా ప్రకటించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు, అఖిలేశ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ కూడా వెనక్కి తగ్గడం లేదు. అఖిలేశ్‌ను కూటమి నేతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. కానీ ఈ విషయంపై కాంగ్రెస్ మౌనంగా ఉంది.

Related Articles

Related image1
బిహార్ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ పార్టీ హ‌వా.. ఏకంగా కాంగ్రెస్‌కే షాక్
Related image2
బిహార్ అయిపోయింది నెక్ట్స్ టార్గెట్ అదే.. మ‌రో రాష్ట్రంపై క‌న్నేసిన బీజేపీ
35
మౌనం వీడని రాహుల్
Image Credit : ANI

మౌనం వీడని రాహుల్

బిహార్‌లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ ఇప్పటికీ మౌనంగానే ఉంది. ఈ విషయంపై రాహుల్ గాంధీ పెద్దగా స్పందించలేదు. బిహార్ ఫలితాలను రాహుల్ ఆశ్చర్యకరమైన ఫలితాలు అని చెప్పినా, పార్టీ భవిష్యత్ ప్రణాళికపై ఎలాంటి సందేశం ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లోనే మమతను ఇండియా కూటమి నేతగా చేయాలని టీఎంసీ గట్టిగా డిమాండ్ చేస్తోంది.

45
పోరాడేది మమతా బెనర్జీనే..
Image Credit : SOCIAM MEDIA

పోరాడేది మమతా బెనర్జీనే..

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేది మమతా బెనర్జీయేనని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని, ఇది మమత స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీతో పోరాడటంలో కాంగ్రెస్ విఫలమవుతోందని, అందుకే మమతను ఇండియా కూటమి నాయకురాలిగా చేయాలని అన్నారు.

55
అఖిలేశ్ కు మద్దతుగా..
Image Credit : ANI

అఖిలేశ్ కు మద్దతుగా..

మరోవైపు, బిహార్ ఎన్నికల ఫలితాలకు ముందే సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రవిదాస్ మెహరోత్రా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. రాహుల్‌ను ప్రజా నాయకుడని కాంగ్రెస్ అనడాన్ని ఆయన విమర్శించారు. అఖిలేశ్‌కు మద్దతుగా నిలుస్తూ, ఇండియా కూటమికి రాహుల్ నాయకత్వం వహించడాన్ని ఆయన వ్యతిరేకించారు. అఖిలేశ్ వైపే ఆయన మొగ్గు చూపారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
భారత దేశం
రాజకీయాలు
రాహుల్ గాంధీ
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved