షాకింగ్.. సీబీఐ కస్టడీనుండి వందకేజీల బంగారం మాయం.. !..
First Published Dec 12, 2020, 10:10 AM IST
తమిళనాడులో సిబిఐ కస్టడీలో103 కేజీల బంగార అదృశ్యమయింది. సిబిఐ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న ఈ ఘటన మీద హైకోర్టు పోలీసు దర్యాప్తుకు ఆదేశించింది. అయితే స్థానిక పోలీసుల దర్యాప్తుతో సీబిఐ ప్రతిష్ట దెబ్బతింటుందని, సిబి-సిఐడిని దర్యాప్తుకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ మీద మాట్లాడుతూ కోర్టు ‘ఇది సిబిఐకి అగ్ని పరీక్షలాంటిదని తెలిపింది. వారు సీతలా పవిత్రంగా ఉంటే ఈ కేసునుండి బయటపడొచ్చు. లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సిందే’ అని చెప్పుకొచ్చింది.

తమిళనాడులో సిబిఐ కస్టడీలో103 కేజీల బంగార అదృశ్యమయింది. సిబిఐ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న ఈ ఘటన మీద హైకోర్టు పోలీసు దర్యాప్తుకు ఆదేశించింది. అయితే స్థానిక పోలీసుల దర్యాప్తుతో సీబిఐ ప్రతిష్ట దెబ్బతింటుందని, సిబి-సిఐడిని దర్యాప్తుకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ మీద మాట్లాడుతూ కోర్టు ‘ఇది సిబిఐకి అగ్ని పరీక్షలాంటిదని తెలిపింది. వారు సీతలా పవిత్రంగా ఉంటే ఈ కేసునుండి బయటపడొచ్చు. లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సిందే’ అని చెప్పుకొచ్చింది.

సిబిఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాష్ట్ర పోలీసులకు బదులుగా సిబిఐ లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేత దర్యాప్తు చేయించాలని కోరినప్పుడు, న్యాయమూర్తి పి ఎన్ ప్రకాష్ మాట్లాడుతూ, “కోర్టు ఈ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోదు, చట్టం ఇలాంటి అనుమానాలకు తావివ్వదు. పోలీసులందర్నీ నమ్మాల్సిందే. సిబిఐకి ప్రత్యేకంగా కొమ్ములున్నాయని, స్థానిక పోలీసులకు సమర్థత లేదని చెప్పడం సరికాదు’ అన్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?