MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • National
  • కాశీ దేవాలయానికి మోడీ మాతృమూర్తి ఎత్తు బంగారం విరాళం.. అజ్ఞాత వీరాభిమాని దాతృత్వం..

కాశీ దేవాలయానికి మోడీ మాతృమూర్తి ఎత్తు బంగారం విరాళం.. అజ్ఞాత వీరాభిమాని దాతృత్వం..

నరేంద్ర మోదీకి వీరాభిమాని అయిన కాశీ విశ్వనాథుని అజ్ఞాత భక్తుడు ఒకరు, గర్భగుడి లోపల బంగారు తాపడం చేయించడానికి ప్రధాని తల్లి హీరాబెన్ శరీర బరువుకు సమానమైన 61 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Mar 02 2022, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వారణాసి : దక్షిణ భారతదేశానికి చెందిన ఒక వ్యాపారవేత్త Kashi Vishwanath Templeకి 61 కిలోల goldన్ని విరాళంగా అందించారు, అందులో ప్రధానమంత్రి narendra modi తల్లి Hiraben బరువుతో సమానమైన బంగారం ఇది అని తెలుస్తోంది. దీంట్లో 37 కిలోల బంగారాన్ని గర్భగుడి లోపలి గోడలను అలంకరించడానికి ఉపయోగించాలని కోరారు. వ్యాపారవేత్త అయిన దాత అజ్ఞాతంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. గత ఆదివారం తన లోక్‌సభ నియోజకవర్గంలో మోడీ సందర్శనలో భాగంగా.. ఆలయంలో ప్రార్థనలు చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో గర్భగుడిలోని బంగారు మెరుపులు చర్చనీయాంశంగా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

"గర్భగుడి లోపలి గోడలకు చేసిన బంగారు పూతలో ఉపయోగించిన బంగారం బరువు ఇటీవల 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ బరువుతో సమానం" అని ఒక సమాచారం. ఆలయంలో బంగారు తాపడం గురించి వారణాసి డివిజనల్ కమిషనర్, దీపక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఆలయానికి 60 కిలోల బంగారం వచ్చిందని, అందులో 37 కిలోల బంగారాన్ని లోపలి గోడకు బంగారు పూత కోసం ఉపయోగించామని చెప్పారు."మిగిలిన 23 కిలోలు ప్రధాన ఆలయ నిర్మాణం,  బంగారు గోపురం దిగువ భాగాన్ని కవర్ చేయడానికి ఉపయోగిస్తాం" అని అగర్వాల్ చెప్పారు.

36

18వ శతాబ్దం తర్వాత ఆలయంలో ఇంత పెద్ద స్తాయిలో మరమ్మత్తులు చేయించడం..ఇది రెండోసారి. మొదటిసారి మొఘలులచే దెబ్బతిన్న ఈ ఆలయాన్ని 1777లో ఇండోర్‌లోని హోల్కర్ రాణి మహారాణి అహల్యాబాయి పునర్నిర్మించారు, ఆ తర్వాత పంజాబ్‌కు చెందిన మహారాజా రంజిత్ సింగ్ ఒక టన్ను బంగారాన్ని విరాళంగా ఇచ్చారు, దీనిని ఆలయంలోని రెండు గోపురాలను కవర్ చేయడానికి ఉపయోగించారు. 

46
পিএম কেয়ার্স-এ আর্থিক সহায়তা - প্রধানমন্ত্রী জানান, সঙ্কটের সময়ে দেখা য়ায়, মা এবং স্ত্রীরা তাদের গহনা এবং সোনা দান করেন। দরিদ্ররাও তাদের টাকার ব্যাগ উজার করে দেয়। যুদ্ধের সময় এটা হতে দেখা গিয়েছে। কোভিড-১৯ সঙ্কটের পরিস্থিতি কোনও যুদ্ধের চেয়ে কম নয়। ইতিমধ্যেই অনেকেই পিএম-কেয়ার্স তহবিলে অনুদান দিয়েছেন। বিজেপি ক্যাডারদেরও প্রধানমন্ত্রী ওই তহবিলে অবদান রাখার জন্য এবং আরও অন্তত ৪০ জনকে দিয়ে এই কাজ করাতে আবেদন করেছেন।

পিএম কেয়ার্স-এ আর্থিক সহায়তা - প্রধানমন্ত্রী জানান, সঙ্কটের সময়ে দেখা য়ায়, মা এবং স্ত্রীরা তাদের গহনা এবং সোনা দান করেন। দরিদ্ররাও তাদের টাকার ব্যাগ উজার করে দেয়। যুদ্ধের সময় এটা হতে দেখা গিয়েছে। কোভিড-১৯ সঙ্কটের পরিস্থিতি কোনও যুদ্ধের চেয়ে কম নয়। ইতিমধ্যেই অনেকেই পিএম-কেয়ার্স তহবিলে অনুদান দিয়েছেন। বিজেপি ক্যাডারদেরও প্রধানমন্ত্রী ওই তহবিলে অবদান রাখার জন্য এবং আরও অন্তত ৪০ জনকে দিয়ে এই কাজ করাতে আবেদন করেছেন।

18వ శతాబ్దం తర్వాత, 2017లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ పునరుద్ధరణ, విస్తరణ ఇటీవలే పూర్తయ్యాయి. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌గా పేరు పెట్టబడిన ఈ ప్రాజెక్ట్ రూ. 900 కోట్లతో పూర్తయింది. సమీపంలోని 300 భవనాలు కొనుగోలు చేశారు. ఆలయ విస్తీర్ణం 2700 చదరపు అడుగుల నుండి 5-లక్షల చదరపు అడుగులకు విస్తరించారు. జలసేన్, మణికర్ణిక, లలితా ఘాట్‌ల ద్వారా గంగా నదితో నేరుగా అనుసంధానం చేయబడింది.
 

56
ಪ್ರಧಾನಿ ಮೋದಿ ತಾಯಿ ಹೀರಾಬೆನ್ ಮೋದಿ ಕೂಡ ದೀಪ ಬೆಳಗಿ ಕೊರೋನಾ ವಿರುದ್ಧದ ಹೋರಾಟಕ್ಕೆ ಕೈಜೋಡಿಸಿದರು

ಪ್ರಧಾನಿ ಮೋದಿ ತಾಯಿ ಹೀರಾಬೆನ್ ಮೋದಿ ಕೂಡ ದೀಪ ಬೆಳಗಿ ಕೊರೋನಾ ವಿರುದ್ಧದ ಹೋರಾಟಕ್ಕೆ ಕೈಜೋಡಿಸಿದರು

భక్తుడు ఇచ్చిన బంగారంతో కాశీ విశ్వనాథ దేవాలయం గోడలు, పైకప్పుపై ఇప్పటికే 37 కిలోల బరువున్న బంగారు పలకలను ఉంచారు. సుమారు ఒకటిన్నర నెలల క్రితం ఈ విరాళం ఇచ్చాడు. ఆదివారం నాటికి మొదటి దశ పని పూర్తయింది, ఈ విషయాన్ని ప్రధాని మోడీ సందర్శన తరువాత ఆయనకు తెలిపి.. అప్పటివరకు జరిగిన పనులు చూపించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 30 గంటల్లో పది మంది కార్మికులు ఈ పని పూర్తి చేశారు.

66

అయితే, ఈ వివరాలపై అధికారులు మౌనం వహించగా, భక్తుడు ప్రధాని మోదీ అనుచరుడు అని, తన తల్లి బరువుతో సమానంగా ఈ విరాళాన్ని ఇచ్చాడని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 100 ఏళ్ల హీరాబెన్ గాంధీనగర్‌లో ఉంటోంది. 187 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడి తాపడం కోసం బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 

About the Author

BS
Bukka Sumabala
భారతీయ జనతా పార్టీ
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image2
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved