దీప్ సిద్ధూ ఎక్కడ? జనవరి 26 తర్వాత మాయం !!
రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో రైతుల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్ధూ అల్లర్ల తర్వాతి నుంచి కనిపించడం లేదు. చివరిసారిగా జనవరి 26న ఎర్రకోట దగ్గర ఆందోళన కారులతో కన్పించిన సిద్ధూ.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో బైక్ మీద వెళ్లిపోయినట్లు వీడియో ఫుటైజ్ వైరల్ అయ్యింది.
రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో రైతుల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్ధూ అల్లర్ల తర్వాతి నుంచి కనిపించడం లేదు. చివరిసారిగా జనవరి 26న ఎర్రకోట దగ్గర ఆందోళన కారులతో కన్పించిన సిద్ధూ.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో బైక్ మీద వెళ్లిపోయినట్లు వీడియో ఫుటైజ్ వైరల్ అయ్యింది.
ట్రాక్టర్ల ర్యాలీపై మంగళవారం తన ఫేస్ బుక్ పేజీలో లైవ్ స్ట్రీమ్ చేసిన సిద్ధూ.. ఎర్రకోట మీద ఆందోళనకారులు మతపరమైన జెండా ఎగరేయడాన్ని సపోర్ట్ చేశారు.
అయితే, తాము జాతీయ జెండాను తొలగించలేదని, ఉద్యమానికి గుర్తుగా కేవలం సిక్కు మత చిహ్నమైన ‘నిశాన్ షాహిబ్’ జెండాను పెట్టినట్లు రైతులు చెబుతున్నారు.
ఈ క్రమంలో జెండా పెట్టిన తరువాత ఎర్రకోటనుంచి సిద్ధూ హాఠాత్తుగా మాయమయ్యారు. అప్పటినుంచి అతని ఆచూకీ లేకుండా పోయింది.
రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో జరిగిన ఘటనలపై పోలీసులు అనేక కేసులు నమోదు చేశారు. వీటిల్లో సిద్ధూ పేరు కూడా ఉంది. ఈ ఘటనపై అతనికి నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.
పంజాబ్ లోని ముక్త్ సర్ జిల్లాకు చెందిన దీప్ లా చదివాడు. గతంలో మోడల్ గా పనిచేశాడు. తర్వాత అనేక పంజాబీ సినిమాల్లో నటించాడు.
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమంలో గతేడాది చేరాడు. అప్పటినుంచి అతన్ని రైతు సంఘాలు అనుమానిస్తూనే ఉన్నాయి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కు దీప్ సిద్ధూ క్లోజ్ గా తిరిగేవాడు. 2019 లోక్ సభ ఎన్నికల్లో సన్నీకి ప్రచారంకూడా చేశాడు. అయితే గతేడాది దీప్ రైతుల ఉద్యమంలో చేరడంతో సన్నీ డియోల్ అతన్ని దూరం పెట్టారు.
2020 సెప్టెంబర్ 25నాడు రైతు సంఘాలు బంద్ కు పిలుపు సందర్భంగా చేపట్టిన ఆందోళనతో మొదటిసారి దీప్ సిద్ధూ క్రియాశీల పాత్ర పోషించాడు. మరికొందరితో కలిసి ఢిల్లీ-హరియాణాల మధ్య షంబు సరిహద్దుల్లో ధర్నా చేయడంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు.
అయితే దీప్ కున్న పాపులారిటీతో తమ అసలు ఎజెండాకు ప్రమాదం వస్తుందని కొన్ని రైతు సంఘాలు భయపడ్డాయి. అతను వాస్తవ సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాడని ఆరోపణలు చేశాయి. మార్టిన్ లూథర్ కింగ్, సిక్కు వేర్పాటవాది భింద్రన్ వాలేలను దీప్ సిద్ధూ తరచూ ప్రస్తావించేవాడని చెబుతుంటారు.