MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Coronavirus: భారీగా నమోదైన కరోనా వైరస్ కొత్త కేసులు.. పెరుగుతున్న మ‌ర‌ణాలు !

Coronavirus: భారీగా నమోదైన కరోనా వైరస్ కొత్త కేసులు.. పెరుగుతున్న మ‌ర‌ణాలు !

Coronavirus: ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెర‌గుతున్నాయి. భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ కొత్త కేసులు, మ‌ర‌ణాలు పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.  

2 Min read
Mahesh Rajamoni
Published : Jun 30 2022, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Coronavirus: భార‌త్ లో మ‌ళ్లీ క‌రోనా ప్ర‌భావం పెరుగుతోంది. కోవిడ్‌-19 కేసులు కూడా అధికంగా న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 18,819 క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త కేసులు నమోదయ్యాయ‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. 

27

క‌రోనా వైర‌స్ కొత్త కేసులు దాదాపు నాలుగు నెలల త‌ర్వాత గరిష్ట సంఖ్య‌లో న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 20న 19,968 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాత అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోదుకావ‌డం ఇదే మొద‌టిసారి. 

37

దేశంలో మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 39 మంది ప్రాణాలు కోల్పోయార‌ని కేంద్రం వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 5,25,116 కు పెరిగింది. మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 4,34,52,164కు చేరుకుంది. 
 

47

క‌రోనా వైర‌స్ కొత్త కేసుల పెరుగుద‌ల కార‌ణంగా యాక్టివ్ కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. క్రియాశీల కేసులు ఇప్ప‌టికే ల‌క్ష మార్కును దాటాయి. ప్ర‌స్తుతం 1,04,555 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

57

క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ యాంత్రాంగాలు కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల‌ను పెంచుతున్నాయి. గత 24 గంటల్లో 4,52,430 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య 86.23 కోట్లకు చేరుకుంద‌ని ఐసీఎంఆర్ తెలిపింది. 
 

67

క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉంది. టాప్‌-10లో  మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్ లు ఉన్నాయి. 
 

77

వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ సైతం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 14,17,217 మందికి వ్యాక్సిన్‌లు వేయగా, మొత్తం టీకాల సంఖ్య 1,97,61,91,554కి చేరుకుంది. ఇందులో మొద‌టి డోసుల సంఖ్య 91.8 కోట్లుగా ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న‌వారి సంఖ్య 84.3 కోట్ల‌కు పెరిగింది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
Recommended image2
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Recommended image3
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved