విషాదం : లిచీపండు గింజ గొంతులో ఇరుక్కుని.. పదోతరగతి విద్యార్థిని మృతి...
లిచీ పండు గింజ గొంతులో ఇరుక్కుని 16యేళ్ల బాలిక మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జోర్హాట్ జిల్లా, కాకాజన్ సోనారి గ్రామంలో ప్రియా బోరా అనే బాలిక 10వ తరగతి చదువుతోంది.
లిచీ పండు గింజ గొంతులో ఇరుక్కుని 16యేళ్ల బాలిక మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జోర్హాట్ జిల్లా, కాకాజన్ సోనారి గ్రామంలో ప్రియా బోరా అనే బాలిక 10వ తరగతి చదువుతోంది.
కానిస్టేబుల్ గా పనిచేసే బాలిక తండ్రి ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు లిచీ పళ్లను తీసుకొచ్చారు. వాటిని తిన్న బాలిక కొంత సేపటికే నేల కూలింది.
ఏమైందో అర్థం కాని తల్లిదండ్రులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు దృవీకరించారు.
సుమారు రెండు అంగుళాల పొడవు ఉండే లిచీ పండు విత్తనం గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఆ అమ్మాయి మరణించిందని వారు స్పష్టం తెలిపారు.
కూతురి మీద ప్రేమతో తెచ్చిన పండ్లు ఆమె ప్రాణాలు తీయడం, ఆకస్మిక మరణం తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
కూతురి మీద ప్రేమతో తెచ్చిన పండ్లు ఆమె ప్రాణాలు తీయడం, ఆకస్మిక మరణం తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.