Bhima Sakhi Scheme : కేవలం పదో తరగతి పాసైతే చాలు.. తెలుగమ్మాయిలకు నెలనెలా రూ.7,000
Bhima Sakhi Scheme : తెలుగు మహిళలకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ఇస్తోంది. కేవలం పదో తరగతి పాసైతే చాాలు… నెలనెలా రూ.7000 సంపాదించవచ్చు. ఈ స్కీమ్ లో చేరాలంటే ఏం చేయాలో తెలుసా..?

తెలుగు మహిళలకు బంపరాఫర్..
Bhima Sakhi Scheme : సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలకు ఏ పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తికాగానే పెళ్లి చేసేస్తుంటారు తల్లిదండ్రులు. పెద్దగా చదువు ఉండదు కాబట్టి అత్తవారింట్లో వారికి ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండాపోయింది. ఇలాంటి మహిళల కోసమే కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది. ఇంట్లో ఉంటూనే నెలకు రూ.7 సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది... ఇందుకోసమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (LIC) భీమా సఖి స్కీమ్ అమలుచేస్తోంది.
ఏమిటీ భీమా సఖి పథకం...?
భారతీయులకు బాగా నమ్మకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా సామాజిక కోణంలో స్కీమ్స్ రూపొందిస్తుంది. ఈ క్రమంలోనే తక్కువ విద్యార్హతలున్న మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా భీమా సఖి యోజన 2026 ను ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తుంది ఎల్ఐసి. అంతేకాదు ఈ శిక్షణ సమయంలో స్టైఫండ్ ఇస్తుంది... అలాగే ఇంటివద్దే పని చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇలా మగువలు స్థిరమైన ఆదాయం పొందుతూ వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా ప్రోత్సహిస్తుంది ఈ పథకం.
ఈ పథకానికి అర్హతలేంటి..?
కేవలం పదో తరగతి పాసై ఉంటే చాలు... ఈ భీమా సఖి యోజన ద్వారా లాభం పొందవచ్చు. 18 నుండి 70 ఏళ్ల వయసు గల మహిళలు అర్హులు. స్థానిక భాషలో మాట్లాడగలగాలి... అంటే తెలుగు రాష్ట్రాల్లో భీమా సఖి యోజనలో చేరాలనుకునే మహిళలకు తప్పకుండా తెలుగు వచ్చివుండాలి. కేవలం మహిళలు మాత్రమే పథకానికి అర్హులు... మరీముఖ్యంగా గ్రామీణ మహిళల కోసం దీన్ని రూపొందించారు. అన్ని అర్హతలున్న మహిళలు ఆన్లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే సమీపంలోని LIC ఆఫీసుకు నేరుగా వెళ్ళవచ్చు. అక్కడ "భీమా సఖి యోజన'' పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని అప్లికేషన్ ఫామ్ తీసుకొండి. సరైన వివరాలతో దీన్ని ఫిల్ చేసి ఆధార్ కార్డు, 10వ తరగతి మార్కుల మెమో, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్ట్ సైజ్ పోటోలు జతచేసి తిరిగి ఎల్ఐసి ఆఫీసులోనే సబ్మిట్ చేయవచ్చు.
మహిళలకు మంచి ఆదాయం...
మహిళా సాధికారతలో భాగంగా ఈ భీమా సఖి యోజనను అమలు చేస్తున్నారు. ఈ పథకానికి ఎంపికైన మహిళలకు ఎల్ఐసి ప్రత్యేక శిక్షణ ఇస్తుంది... పాలసీల విక్రయం, కస్టమర్లకు అవగాహన కల్పించేలా తీర్చిదిద్దుతారు. శిక్షణ సమయంలో నెలనెలా రూ.7 వేలు స్టైఫండ్ ఇస్తారు... ఇలా మూడు సంవత్సరాల నెలనెలా అందిస్తారు. ఇక మీరు చేసే పనికి కమీషన్ కూడా లభిస్తుంది... అంటే ఎన్ని పాలసీలు విక్రయిస్తే అంత ఏజెంట్ కమీషన్ లభిస్తుంది. ఇలా మొదటి సంవత్సరంలోనే దాదాపు రూ.50000 వరకు సంపాదించే అవకాశముంది.

