Youtuber Nandu: నా అన్వేషణ అన్వేష్ లాగా కాదు.. ఆనందంలో మునిగి తేలుతున్న యూట్యూబర్ నందు
Youtuber Nandu:ప్రస్తుతం ఎక్కడ చూసినా యూట్యూబర్ నందు గురించే చర్చ జరుగుతోంది. యూకేలో నివసిస్తున్న ఈ తెలుగు ఫ్యామిలీ... వీసాలు ఇప్పిస్తామంటూ చాలా మందిని మోసం చేశారు అని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శల వేళ నందూ ఫ్యామిలీ చాలా ఆనంద పడుతోందంట.

యూట్యూబర్ నందు..
యూట్యూబ్ లో వీడియోలు చూసే అందరికీ యూట్యూబర్ నందు( నందూస్ వరల్డ్) గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ వాయిస్ తో.. కడుపుబ్బా నవ్వించే వీడియోలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ క్రేజ్ తోనే ఏకంగా చిరంజీవి సినిమాలో ఛాన్స్ కూడా కొట్టేసింది. కొద్ది రోజుల క్రితం వరకు వీరికి సోషల్ మీడియాలో చాలా మంచి వారు అనే అభిప్రాయం ఉండేది. సడెన్ గా... కొద్ది రోజుల క్రితమే వారు యూకేలో చూస్తున్న మోసం బయటపడింది. ముఖ్యంగా నందు భర్త మధు... చాలా మంది తెలుగు యువతను.. వీసాలు ఇప్పిస్తామని నమ్మించి.. లక్షల్లో డబ్బు తీసుకొని. తర్వాత వారికి కనీసం వారికి వీసాలు ఇప్పించకుండా మోసం చేశారంటూ వార్తలు వస్తున్నాయి.
నందూకి ఫాలోవర్స్ సపోర్ట్...?
చాలా మంది మోసం మోసపోయాం అంటూ.. సోషల్ మీడియాలో చెప్పడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత మరొకరు..బాధితులు బయటకు రావడంతో వారి మోసం బయటపడింది. అయితే... ఎక్కడైనా.. వీళ్లు మోసగాళ్లు అని బయటపడితే..వారిపై ద్వేషం చూపిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే.... అన్ ఫాలో చూసి..వారిపై ఉన్న ద్వేషాన్ని చూపిస్తారు. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ విషయంలో కూడా అదే జరిగింది. హిందూ దేవుళ్ల గురించి తప్పుగా మాట్లాడటంతో అందరూ కలిసి అతనిపై విమర్శలు చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసి.. అతను తిరిగి క్షమాపణలు చెప్పేలా చేశారు. అయితే.. నందూ విషయంలో మాత్రం రివర్స్ జరిగింది.
నందు భర్త మధు..చాలా మంది అమాయకులను మోసం చేశారు అని తెలిసిన తర్వాత.. రివర్స్ లో.. వాళ్ల ఇన్ స్టాగ్రామ్ ఫాలో వర్లు, యూట్యూబ్ లో సబ్ స్క్రైబర్లు ఒక్కరు కూడా తగ్గకపోవడం విశేషం. ఈ వివాదం బయటకు రాకముందు ఇన్ స్టాగ్రామ్ లో 247కే ఫాలోవర్స్ , యూట్యూబ్ లో 2.88 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే.. వివాదం తర్వాత కూడా వీరి ఫాలోవర్స్ అలానే ఉండటం విశేషం.‘ మోసపోయింది నేను కాదు..నేను ఎందుకు అన్ సబ్ స్క్రైబ్ చేసుకోవాలి? పోయింది నా డబ్బు కాదు కదా.. నేను సరదాగా వీడియోలు చూసి నవ్వుకుంటున్నాను కదా’ అనే యాంగిల్ లో ప్రజలు ఆలోచిస్తున్నారా అనే ప్రశ్నలు మొదలౌతున్నాయి.
వైరల్ అవుతున్న ధోతీ ఫంక్షన్ వీడియో..
అంతేకాదు.. గతేడాది నందు.. తమ కుమారుడికి ఇండియాలో చాలా గ్రాండ్ గా పంచల ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్ వీడియోని అప్పుడు జనాలు ఎంత మంది చూశారో తెలీదు కానీ.. ఇప్పుడు ఈ వివాదం తర్వాత.. ఆ వీడియో వైరల్ గా మారడం విశేషం. అంతేకాదు.. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆ ఫంక్షన్ ని జనాలను మోసం చేసిన డబ్బుతోనే చేశారంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా.. ఆ పంచల ఫంక్షన్ లో డెకరేషన్ లో వాడిన పూల దగ్గర నుంచి..ఆమె ధరించిన చీర, నగలు అన్నింటినీ చూస్తూ.. దాని గురించే కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ల కామెంట్స్, వ్యూస్ తో ఆ వీడియోని వైరల్ చేసి.. యూట్యూబ్ లో నందు కి క్రేజ్ మరింత పెంచుతున్నారు.
ఇక.. ఇన్ని విమర్శలు, ఇంత వివాదం జరిగినా కూడా.. తమ ఫాలోవర్స్ తమను నమ్మారని.. తమను అన్ ఫాలో చేయలేదని.. నందు ఫ్యామిలీ భావిస్తోందంట.
