మీకు తెలుసా.. ఇటువంటి ఆహారం తీసుకున్నాక నీళ్లను తాగితే అస్సలు మంచిది కాదట..
ఎటువంటి ఆహారాన్ని తీసుకున్నా సరే వెనువెంటనే నీళ్లను తాగిందాక కొందరికి మనసు కుదుట పడదు. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలను, పండ్లను తీసుకున్న తర్వాత నీళ్లను అస్సలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే..
ఇతర సమయాల్లో నీళ్లు తాగకున్నా.. ఏదైనా ఆహారం తిన్నప్పుడు మాత్రం పక్కాగా నీళ్లను తాగుతుంటాం. కొందరైతే అన్నం తినేటప్పుడు కానీ మరేదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు కానీ బుక్క బుక్కకు నీళ్లను తాగిందాక ఊరుకోరు. నీళ్లు ఆరోగ్యానికి మంచివే అయినా కొన్నిరకాల ఆహార పదార్థాలను తినేటప్పుడు, తిన్న తర్వాత నీళ్లను అస్సలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినే ప్రమాదముంది. అందుకే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినేటప్పుడు నీళ్లను అస్సలు తాగకూడదు. ఏయే ఆహారాలను తీసుకునేటప్పుడు నీళ్లను తాగకూడదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
చాలా మంది ఫుడ్ తీసుకునేటప్పుడే కాదు పండ్లు తినేటప్పుడు కూడా తరచుగా నీళ్లను తాగుతూ ఉంటారు. కానీ పండ్లను తిన్న వెనువెంటనే నీళ్లను అస్సలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పండ్లలో ఈస్ట్, చక్కెర శాతం ఎక్కువగా ఉంటాయి. మనం తిన్న ఆ పండ్లు Properly digested అవ్వాలి. కాగా ఇటువంటి ఆహారం జీర్ణం అవడానికి కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదల అవాలి. అయితే పండ్లు తిని ఆ వెంటనే నీళ్లను తాగితే ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కరిగిపోయి ఆ పండ్లు జీర్ణం కావు. ఆ సమయంలో కడుపు తీవ్ర ఇబ్బందికి గురవుతుంది. అందుకే కొన్ని రకాల పండ్లు తిన్న వెంటనే నీళ్లను అస్సలు తాగకూడదు.
నారింజ, దోసకాయ, పుచ్చకాయ వంటి పండ్లలో ఈస్ట్, చక్కెర, నీటి శాతం ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ పండ్లను తిన్నప్పుడు వెంటనే నీళ్లను తాగకూడదు. ఎందుకంటే ఈ పండ్లను తిన్న వెంటనే నీళ్లను సేవిస్తే డయేరియా వంటి ప్రమాదకరమైన జబ్బు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇవే కాదు అన్నం తిన్న తర్వాత కూడా నీళ్లను తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నం తిన్న తర్వాత అప్పుడే నీటిని తాగితే Digestive system కు ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఆ ఆహారం జీర్ణం అవడం కష్టతరమవుతుంది. అందుకే తిన్న వెంటనే కాకుండా 30 నిమిషాల తర్వాత నీటిని తాగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. తిన్న వెంటనే నీళ్లను తాగితే ఊబకాయం సమస్య బారిన పడతామని ఆయుర్వేదం చేబుతోంది. వీటితో పాటుగా ఐస్ క్రీం తిన్న తర్వాత కూడా ఆ వెంటనే నీళ్లను తాగొద్దు.
అలాగే నువ్వులు, వేరు శెనగలు తిన్నవెంటనే కూడా నీళ్లకు దూరంగానే ఉండాలి. వీటిని తిన్న వెంటనే నీళ్లు తాగితే దగ్గు సమస్య అటాక్ చేసే ప్రమాదముంది. ఇకపోతే చెరుకు తిని కూడా నీళ్లను తాగకూడదు. ఎందుకంటే ఈ చెరకులో పొటాషియం, క్యాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అటువంటప్పుడు దాన్ని తిన్న వెంటనే నీళ్లను తాగితే నోటిలో పొక్కులు, పగుళ్లు వస్తాయి. అలాగే కడుపులో కూడా సమస్యలు రావొచ్చు. అందుకే పండ్లను, ఆహారాన్ని తీసుకునే ముందు ఈ విషయాలను గుర్తించుకోవాలి. లేదంటే ఈ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.