MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • రెస్టారెంట్లలో ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార ఎందుకు కలుపుతారు?

రెస్టారెంట్లలో ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార ఎందుకు కలుపుతారు?

Leafy Vegetables: ప్రతి ఇంట్లోనూ ఆకుకూరలు వండడం సహజమే. వాటిని వండేటప్పుడు చిటికెడు చక్కెర ఎంతో మంది కలుపుతారు. రెస్టారెంట్లలో కూడా ఈ ట్రిక్ ఉపయోగిస్తారు. ఎందుకో తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 27 2025, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చలికాలంలో ఆకుకూరలు
Image Credit : Pixabay

చలికాలంలో ఆకుకూరలు

చలికాలం వచ్చేసింది. ఈ రోజుల్లోనే ఎక్కువగా ఆకుకూరలు మార్కెట్లో దొరుకుతాయి. ముఖ్యంగా పాలకూర వంటి ఆకుపచ్చని కూరగాయలు మార్కెట్లో పుష్కలంగా ఉంటాయి. వీటితో చేసే ఆహారాలు కూడా టేస్టీగా ఉంటాయి. అయితే ఈ ఆకుకూరలను వండేటప్పుడు రెస్టారెంట్లలో చిటికెడు చక్కెరను కలుపుతారు. ఇలా చేయడం వల్ల ఆకుకూరల్లో ఎలాంటి మార్పు వస్తుందో తెలుసుకోండి.

24
చిటికెడు చక్కెర కలిపితే
Image Credit : Pixabay

చిటికెడు చక్కెర కలిపితే

పాలకూర వంటి ఆకుపచ్చని కూరగాయలు వండేటప్పుడు చిటికెడు చక్కెర జోడించడం వల్ల వాటి రంగు అలాగే ఉంటుంది. కొన్నిసార్లు ఆకుపచ్చని ఆకుకూరలు వండుతున్నప్పుడు నలుపు రంగులోకి లేదా ఇంకా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోయే అవకాశం ఉంటుంది. అలా మారకుండా ఉండాలంటే చక్కెర కలిపితే సరిపోతుంది. రెస్టారెంట్లలో మీరు ఆర్డర్ చేసే ఆకుపచ్చని చట్నీలు, సూప్ లను చూడండి. అవి మంచి ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటాయి. దీనికి కారణం కొద్దిగా చక్కెరను జోడించడమే.

Related Articles

Related image1
బ్యాంకుల నుంచి వచ్చే అనవసర కాల్స్‌ తో విసిగిపోయారా? ఈ చిన్న పనితో వాటిని ఆపేయండి
Related image2
వైరల్ ఫీవర్, డెెంగ్యూ జ్వరాలకు.. గుండె పోటుకు మధ్య సంబంధం ఉందా?
34
రుచి కూడా పెరుగుతుంది
Image Credit : Pixabay

రుచి కూడా పెరుగుతుంది

ఆకుకూరల్లో చక్కెర కలపడం వల్ల రుచి కూడా సమతుల్యంగా మారుతుంది. ఆకుకూరల్లో ఉండే చేదు తగ్గిపోతుంది. పాలకూరలో కూడా కాస్త చేదు ఉంటుంది. ఆ చేదును సమతల్యం చేసే శక్తి పంచదారకు ఉంది. అలా అని మరీ ఎక్కువ చక్కెర వేయకూడదు. అప్పుడు కూర తీపిగా మారిపోయి సహజమైన రుచిని కోల్పోతుంది. చిటికెడు చక్కెర జోడిస్తే చాలు.

44
ముందే ఉడకబెట్టి
Image Credit : Pixabay

ముందే ఉడకబెట్టి

పాలకూర వంటి ఆకుకూరలను వండే ముందు ఒకటి నుంచి రెండు నిమిషాలు నీటిలో ఉడకబెట్టాలి. తర్వాత వాటిని తీసి చల్లని నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల కూరగాయలు తమ ప్రకాశమంతమైన ఆకుపచ్చ రంగును కోల్పోకుండా ఉంటాయి. అలాగే రుచిని కూడా పెంచుతాయి. కర్రీ, చట్నీ, సూప్ ఇలా ఏం తయారు చేసినా కూడా ఈ చిట్కాను పాటించండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇలాగైతే ఓజాంపిక్ పిల్లలు పుడతారు... తస్మాత్ జాగ్రత్త.. !
Recommended image2
Fatty Liver: సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ ముప్పు..కారణమిదే..
Recommended image3
Sleep Psychology: రాత్రి ఎక్కువసేపు మెలకువతో ఉండేవాళ్ల గురించి సైకాలజీ ఏం చెప్తోందో తెలుసా?
Related Stories
Recommended image1
బ్యాంకుల నుంచి వచ్చే అనవసర కాల్స్‌ తో విసిగిపోయారా? ఈ చిన్న పనితో వాటిని ఆపేయండి
Recommended image2
వైరల్ ఫీవర్, డెెంగ్యూ జ్వరాలకు.. గుండె పోటుకు మధ్య సంబంధం ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved