MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Muharram 2022: మొహర్రం పండుగ జరుపుకోవడం వెనకున్న అసలు కథ ఇదే..!

Muharram 2022: మొహర్రం పండుగ జరుపుకోవడం వెనకున్న అసలు కథ ఇదే..!

Muharram 2022: ముస్లిం లు జరుపుకునే పండుగల్లో మొహర్రం కూడా ఎంతో పవిత్రమైంది. త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు.

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 02 2022, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
muharam

muharam

ప్రపంచ వ్యాప్తంగా రంజన్ తర్వాత వచ్చే రెండో మాసం నుంచి ముస్లింలకు కొత్త ఏడాది స్టార్ట్ అవుతుంది. నిజానికి మొహర్రం అసలు పండుగే కాదు. ఇస్లాం మతం క్యాలెండర్ ప్రకారం.. అమరవీరుల త్యాగాన్ని గుర్తుచేసుకునే కార్యక్రమమే మొహర్రం. 

25
Asianet Image

పీర్ల ఊరేగింపు

మొహర్రం పండుగనే పీర్ల పండుగ అంటారు. ఈ పండుగ సందర్భంగా మొహర్రం స్టార్ట్ అయిన మొదటి రోజున మూస్లింలు పీర్లను ప్రతిష్టించి, ప్రార్థనలు చేస్తారు. హిందువులు కూడా ఎప్పటి నుంచో పీర్లను పూజిస్తూ వస్తున్నారు. అంతేకాదు పీర్ల పండుగ సందర్బంగా బెల్లంతో చేసిన స్వీట్ ను రొట్టెలను నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాత పీర్లను ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో హజరత్ ఇమామ్ హుస్సేన్ కు సంతాపాన్ని కూడా తెలియజేస్తారు. ఈ ఊరేగింపునకు ముందు రోజు నైట్ నిప్పుల మీద నడుస్తారు.  నిప్పులపై నడిచినా.. చిన్న పాటి గాయం కూడా కాదు. దీనికి అల్లాహ్ మహిమే కారణం అంటారు. ఈ ఆచారం పూర్వకాలం నుంచి కొనసాగుతూనే వస్తోంది. 

35
Asianet Image

చరిత్ర ప్రకారం.. మొహర్రం నెలలోని మొదటి రోజు ఇరాక్ లో యుద్దం మొదలైంది. కాగా మొహర్రం పదో రోజున ఇమాం హుస్సేన్ నమాజ్ చేస్తున్న సమయంలో శత్రు సైన్యం దాడి చేసి ఆయన్ను హతమార్చింది. అంతేకాదు యజీద్ సైన్యం హుస్సేన్ కుటుంబాన్ని, పిల్లల్ని, మహిళలకు కూడా చంపేశారు. ఈ యుద్దంలో మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన 70 మంది ప్రాణాలు కోల్పోతారు. ఇంత మందిని చంపినందుకు గాను హజరత్ హుస్సేన్ శత్రు సైన్యానికి.. ఎప్పటికీ  మోక్షం లభించకూడదని ప్రార్థిస్తూ చనిపోతాడు. 
 

45
Asianet Image

ఇక యుద్దం మొత్తం అయిపోయిన తర్వత.. యాజిద్ తెగ..  దైవ ప్రవక్త మహ్మద్ వంశస్థులను చంపేశామని పశ్చాత్తాపపడుతూ.. మమ్మల్ని క్షమించండని ఏడుస్తూ.. నిప్పుల మీద నడుస్తూ.. గుండెలపై బాదుకుంటారు. 
 

55
Asianet Image

ఈ మొహర్రం నెలలలో ముస్లింలు ఎలాంటి  శుభకార్యాలను చేయరు. అందులోనూ పీర్లను ప్రతిష్టించిన వారు కణకణలాడే నిప్పులపై నడుస్తారు. శత్రువుల చేతిలో అమరులైన తమ కుటుంబ సభ్యులను తలచుకుంటూ.. రెండు రోజుల పాటు ఉపవాసం చేస్తారు. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved