Recipes: కమ్మనైన మెంతి మష్రూమ్ కర్రీ.. రైస్ లోకైనా రోటిలోకైనా అదిరిపోద్దంతే!
Recipes: మెంతి మష్రూమ్ కర్రీ ఉత్తర భారతదేశపు ప్రత్యేకమైన కూర. కేవలం అన్నంలోకే కాకుండా చపాతీల్లోకి నాన్స్ లోకి కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీని మేకింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం.

మెంతి మష్రూమ్ కర్రీ ప్రత్యేకమైన సందర్భాలలోనూ పార్టీలలోనూ చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్ స్టైల్ డిష్ తయారు చేయడం చాలా సులభం. కాస్త ఓపిక కావాలి అంతే ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేయాలో చూద్దాం.
ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు : పుట్టగొడుగులు పావు కేజీ, టమాటాలు మీడియం సైజ్ వి మూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, యాలక్కాయలు రెండు, అంగుళం దాల్చిన చెక్క, ఒక నల్ల యాలక, ఒక పులావ్ ఆకు, రెండు మూడు లవంగాలు, జాపత్రి ఒకటి అలాగే పెరుగు ఒక కప్పు. ఉప్పు కారం మీ రుచికి తగినంత. ముందుగా పావు కేజీ.
ముందుగా పుట్టగొడుగులని శుభ్రంగా కడుక్కొని బట్టతో తుడిచి పొడిగా చేసుకోండి తర్వాత ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పావు కప్పు పెరుగులో చిటికెడు ఉప్పు కలిపి బాగా గెలకొట్టండి అందులో తరిగి పెట్టుకున్న పుట్టగొడుగులని వేసి మళ్లీ ఒకసారి కలిపి ఒక అరగంట పాటు పక్కన వదిలేయండి.
ఆ సమయంలో మెంతి ఆకు ఉంటే ఒక కప్పు లేకపోతే మెంతులు అయితే కనుక ఒకటి రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది. వీటిని కడిగి తరిగి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మసాలా దినుసులు అన్ని వేసి కాస్త వేపండి. తర్వాత పావు కప్పు తరిగిన ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు గోధుమ రంగుకి వచ్చిన తరువాత..
ఒకటి రెండు పెరిగిన పచ్చిమిరపకాయలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్లీ వేయించండి ఆ తరువాత ఒక మూడు మీడియం సైజు టమాటాలని తరిగి అందులో వేయండి.బాగా కలిపి మెత్తగా అయ్యేవరకు ఉడికించండి. కూర అంతా దగ్గరగా అవుతున్న తరుణంలో పెరుగులో మాగ్నెట్ చేసిన పుట్టగొడుగులని వెయ్యండి.
తర్వాత మెంతి ఆకులను కూడా వేసి బాగా కలపండి. తర్వాత ఉప్పు కారం మసాలా అన్ని సరిగా ఉన్నాయో లేదో చూసుకొని కూర మీద మూత పెట్టండి 8 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించండి. ఇంకేముంది గుమగుమలాడే మెంతి మష్రూమ్ కర్రీ రెడీ.