MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రేపిస్టులే? ఏ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారో తెలుసా

ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రేపిస్టులే? ఏ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారో తెలుసా

ఎంపీలు, ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులు: కోల్‌కతాలో శిక్షణ పొందుతున్న వైద్యురాలిపై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహానికి దారితీసింది. బదలాపూర్, అకోలాలోనూ పాఠశాల విద్యార్థులపై దుష్ప్రవర్తన ప్రజలను రోడ్లపైకి వచ్చేలా చేసింది. ఎంత మంది ప్రజాప్రతినిధులపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయో మీకు తెలుసా? 

2 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : Aug 29 2024, 08:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
151 మందిఎంపీలు, ఎమ్మెల్యేలపై ఎఫ్ఐఆర్

151 మందిఎంపీలు, ఎమ్మెల్యేలపై ఎఫ్ఐఆర్

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఎడీఆర్) పరిశోధన నివేదిక ప్రకారం దేశంలోని ప్రస్తుత 151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై మహిళల వేధింపులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది.

25
ఏయే నేరాల్లో ప్రజాప్రతినిధులపై కేసులు నమోదయ్యాయి?

ఏయే నేరాల్లో ప్రజాప్రతినిధులపై కేసులు నమోదయ్యాయి?

దేశంలోని ప్రస్తుతం ఉన్న 150 మంది ప్రజాప్రతినిధులపై యాసిడ్ దాడులు, లైంగిక వేధింపులు, వేధింపులు, స్త్రీని నగ్నంగా చేయడం, ఆమెను వెంబడించడం, మైనర్ బాలికలను వ్యభిచారం కోసం కొనుగోలు చేయడం, అమ్మడం, మహిళలపై గృహ హింస, వివాహిత స్త్రీని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, కిడ్నాప్, అంగీకారం లేకుండా స్త్రీతో బలవంతంగా ఉండటం, కట్నం హత్య, భార్య ఉండగానే మరో వివాహం వంటి అంశాలలో ఎఫ్ఐఆర్ నమోదైంది.

35
బీబీసీ నివేదిక ప్రకారం..

బీబీసీ నివేదిక ప్రకారం..

బీబీసీ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా 775 మంది ఎంపీలు, 3938 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ అఫిడవిట్‌లో తమపై మహిళా లైంగిక వేధింపుల కేసు నమోదైందని అంగీకరించారు. ప్రస్తుతం 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

45
ఏ పార్టీలో ఎక్కువ కేసులు?

ఏ పార్టీలో ఎక్కువ కేసులు?

ఏడీఆర్ నివేదిక ప్రకారం దేశంలో కళంకిత ఎంపీలలో బీజేపీ ప్రజాప్రతినిధులే అధికంగా ఉన్నారు. వీరిలో 44 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 10 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన 23 మంది, తెలుగుదేశం పార్టీకి చెందిన 17 మంది ప్రజాప్రతినిధులపై కేసులు నమోదయ్యాయి. ఆప్‌కు చెందిన 13 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదు కాగా, టీఎంసీకి చెందిన 10 మంది, ఆర్జేడీకి చెందిన 5 మంది ప్రజాప్రతినిధులపై కేసులు నమోదయ్యాయి.

55
ఎంత మందిపై అత్యాచార కేసులు?

ఎంత మందిపై అత్యాచార కేసులు?

ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం, దేశంలోని 16 మంది ప్రజాప్రతినిధులపై అత్యాచార కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డేటా ప్రకారం బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన ఐదుగురు ప్రజాప్రతినిధులపై అత్యాచార కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలపై అత్యాచార కేసులు ఉన్నాయి. వీటితో పాటు ఆప్, టీఎంసీ, ఏఐయూడీఎఫ్, భారత్ ఆదివాసీ పార్టీ, బీజేడీలకు చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యేపై అత్యాచార కేసు నమోదైంది.

 

 

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఆకు కూరలు ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంచాలంటే…ఈ టిప్ ఫాలో అవ్వండి
Recommended image2
Balcony Plants: బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు
Recommended image3
Garlic Farming: ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved