MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • డౌటే లేదు.. ఈ లక్షణాలు మీలో ఉంటే స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయినట్టే..

డౌటే లేదు.. ఈ లక్షణాలు మీలో ఉంటే స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయినట్టే..

టీవీ లేని ఇల్లు ఎలా అయితే ఉండదో.. స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తులు ఈ సమాజంలో అస్సలు లేరు. అవును ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల కాలమే నడుస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ను నిమిషం కూడా వదలని వారు చాలా మంది ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఎంతో మంది ఈ స్మార్ట్ ఫోన్ మాయలో పడి.. వాటికి బానిసలుగా మారారు. 

3 Min read
Mahesh Rajamoni
Published : Feb 27 2022, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలు తగ్గి, మనుషులకు ఎలక్ట్రానికి గాడ్జెట్స్ తో విడదీయలేని సంబంధం ఏర్పడుతోంది. ముఖ్యంగా మనుషులకు, స్మార్ట్ ఫోన్లకు ఎవరూ విడదీయలేని బంధం ఏర్పడింది. ఈ ఫోన్ లేకుండా నిమిషం కూడా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. 

211

కరోనా మహమ్మారి రాకతో స్కూలు పిల్లలు సైతం వీటికి బాగా అలవాటైపోయారు. స్మార్ట్ ఫోన్ లేని నిమిషం ఒక యుగంలా గడుపుతున్నారు. కొందరికైతే ఈ స్మార్ట్ ఫోన్ లేనిదే పూట కూడా గడవదు. ఇది ఒక నిత్యవసర వస్తువులా మారిపోయిందంటే నమ్మండి.

311
smart phone

smart phone

రోజంతా తిండి , నీళ్లూ లేకుండానన్నా ఉంటారేమో గానీ చేతిలో ఫోన్ లేకుండా మాత్రం అస్సలు ఉండరు. ఇది నమ్మలేని నిజం. ఎంతో మంది స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారారు. ఈ సంగతి వాళ్లకు తెలియకపోయినా.. ఇదే నిజం. ఏప్రిల్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. కరోనా వచ్చినప్పటి నుంచి ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి 81 శాతం మంది జనాలు వీడియో కాల్స్ ను ఉపయోగించారట.

411
smart phone

smart phone

81 శాతం మందిలో 40 శాతం జనాలు విడీయో కాల్స్ లో మాట్లాడి, వాడకం ఎక్కువయ్యి అలసిపోయారనీ సర్వే తేల్చి చెబుతోంది. ఇకపోతే 33 శాతం మంది ప్రజలు తాము ఫోన్ తో గడిపిన లేదా ఇంటర్నెట్ లో ఎంత సేపు గడిపామో తెలుసుకోవడానికి ప్రయత్నించినట్టు సర్వే పేర్కొంటోంది. 

511

స్మార్ట్ ఫోన్ వాడకం అంత బ్యాడ్ హాబిట్ ఏమీ కాదు. ఫోన్లు వ్యక్తుల మధ్య బంధాలను పెంచుతాయి. ఎన్నో విధాలుగా మనల్ని స్మార్ట్ ఫోన్లు సంతోషపెడుతుంది. కానీ అతిగా ఏది చేసినా.. ఏదీ వినాశనానికి దారి తీస్తుంది. కాబట్టి స్మార్ట్ ఫోన్లను కూడా ఒక సమయం వరకే ఉపయోగించాలి. లేదంటే ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

611

వాట్సాప్, టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్, షేర్ చాట్ వంటి యాప్ లను తరచుగా చూసే అలవాటును క్రమ క్రమంగా మానుకోండి. మితిమీరిన స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల మీతో పాటుగా అవతలి వ్యక్తులను కూడా ఇబ్బందులకు గురిచేస్తాయి. ముఖ్యంగా మిమ్మల్ని చూసి అవతలి వ్యక్తులు కూడా ఫోన్ కు అలవాటయ్యే ప్రమాదం ఉంది. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. 

711

ఏవైనా అప్ డేట్స్ వస్తాయని అదే పనిగా ఫోన్ వంకే చూసే వారు డూమ్ స్క్రోలింగ్ సమస్యతో బాధపడుతున్నట్టుగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమస్య వల్ల వారు ఎన్నో మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందట. దీని నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత ఆరోగ్యానికి మంచిదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

811

మరేం చేయాలి? 
సోషల్ మీడియాను చూసే టైమింగ్స్ ను తగ్గించుకోవాలి. అంటే రోజుకు ఎక్కువ సమయం సోషల్ మీడియాను ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఉదయం లేచినప్పుడు, పడుకునేటప్పుడు ఫోన్లను చెక్ చేయడం, చూడటం మానుకోండి. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

911

ఆరోగ్యం ముఖ్యం.. యోగా, వ్యాయామం వంటివి ప్రతి రోజూ చేయండి. వీటి వల్ల మీరు ఉల్లాసంగా ఉంటారు. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. వీటివల్ల మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు.

1011

స్టాప్ టెక్నిక్..మొబైల్ ఫోన్ను ఎక్కువగా వాడుతున్నాను అనిపిస్తే వెంటనే స్టాప్ అని గట్టిగా అరవడం అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే మీ మెదడుకి ఇక ఫోన్ చూసింది చాలు అన్న సందేశం చేరుతుంది. దాంతో మీరు ఫోన్ ను ఎక్కువ సేపు చూడలేరు.
 

1111

చిన్నపిల్లలకు స్మార్ట్ ఫోన్లను ఇవ్వకండి. ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల పిల్లలో అంధతర్వం వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఫోన్లు ఇస్తూ వారిని గుడ్డి వారిని చేస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లలు స్మార్ట్ ఫోన్లను దగ్గరినుంచి చూసి చూసి దూరంగా ఉండే వస్తువులను చూడలేకపోతున్నారని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఫోన్ లైటింగ్ వల్ల వారి చూపు దెబ్బతింటుందట. కాబట్టి ఇకనుంచి పిల్లలకు ఫోన్లను అస్సలు ఇవ్వకండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved