- Home
- Life
- Garuda Puranam: మనిషి చనిపోయిన వెంటనే కుటుంబ సభ్యులు ఈ పనులు చేస్తే.. స్వర్గానికి వెళతారు..!
Garuda Puranam: మనిషి చనిపోయిన వెంటనే కుటుంబ సభ్యులు ఈ పనులు చేస్తే.. స్వర్గానికి వెళతారు..!
Garuda Puranam: గరుడ పురాణం స్వర్గ నరకాల గురించి, పాప పుణ్యాల గురించి క్షున్నంగా వివరిస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే చెప్పే శాస్త్రం ఇది. మరి, ఈ గంథ్రం ప్రకారం మనిషి మరణం అంచుల వద్ద ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా?

Garuda Purana
హిందూ మతంలో గరుడ పురాణం అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన గ్రంథంగా పరిగణిస్తారు. ఇది కేవలం ఒక మతపరమైన గాథ మాత్రమే కాదు.. జీవన, మరణానికి సంబంధించిన లోతైన సత్యాలను వివరించే గ్రంథం కూడా. ఒక వ్యక్తి తాను చేసిన కర్మలే అతని భవిష్యత్తు, మరణానంతరం అతని స్థితిని నిర్ణయిస్తాయని ఈ గరుడ పురాణంలో వివరించారు. ఈ గరుడ పురాణం అత్యంత గొప్ప విశిష్టత ఏమిటంటే.. ఇది ఒక వ్యక్తి సత్కర్మలు ఆచరించేలా ప్రేరేపిస్తుంది. ఈ గ్రంథం ప్రకారం..ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత లేదా.. మరణం చివరి అంచుల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు చేసే కొన్ని పనులు వారిని స్వర్గానికి చేరుస్తాయి.
1.తులసి...
సనాతన ధర్మంలో తులసిని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. మరణించే వ్యక్తి శరీరం వద్ద గానీ, లేదా నోటిలో గానీ తులసి ఆకులు ఉంటే, ఆ వ్యక్తి ఆత్మ యమలోకానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని నమ్ముతారు. అందుకే, మరణ సమయంలో ఆ వ్యక్తిని తులసి మొక్క దగ్గర ఉంచడం, అలాగే అతని నుదుటిపై లేదా నోటిలో ఒక తులసి ఆకును ఉంచడం ఆచారంగా వస్తోంది.
గంగా జలం..
మరణ సమయంలో ఒకరి నోటిలో గంగా జలాన్ని పోసే సంప్రదాయం కూడా ఉంది. మతపరమైన విశ్వాసాల ప్రకారం, గంగా జలం శ్రీ మహా విష్ణు పాదాల నుండి ఉద్భవిస్తుంది. ఈ నీరు పాపాలను హరిస్తుందని నమ్ముతారు. గంగా జలాన్ని సేవించిన తర్వాత మరణించిన వ్యక్తి స్వర్గ ప్రాప్తి పొందుతాడని నమ్ముతారు.
నల్ల నువ్వులు..
నల్ల నువ్వులను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నువ్వులకు శ్రీ మహా విష్ణువుతో అనుబంధం ఉంది. నువ్వులను దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. మరణ సమయంలో నల్ల నువ్వులను దగ్గరగా ఉంచడం వల్ల దుష్ట శక్తులను దూరంగా ఉంటాయి. తద్వారా ఆత్మ ప్రయాణం సాఫీగా సాగేలా చేస్తుందని నమ్మకం.
కుశ గడ్డి
మతపరమైన కర్మకాండలలో ఉపయోగించే కుశ గడ్డిని కూడా పవిత్రమైనదిగా భావిస్తారు. మరణ సమయంలో ఒక వ్యక్తిని కుశ గడ్డితో చేసిన చాపపై పడుకోబెట్టడం ద్వారా, ఆ ఆత్మ ప్రయాణానికి ఒక స్వచ్ఛమైన , ప్రశాంతమైన మార్గం లభిస్తుందని నమ్ముతారు.

