MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మధుమేహులు తిన్న తర్వాత ఈ పని చేస్తే షుగర్ అదుపులో ఉంటుంది..

మధుమేహులు తిన్న తర్వాత ఈ పని చేస్తే షుగర్ అదుపులో ఉంటుంది..

డయాబెటీస్ ఎన్నో కారణాల వల్ల వస్తుంది. దీనిని నియంత్రించకుంటే వీరి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అయితే ఈ షుగర్ పేషెంట్లు తిన్న తర్వాత ఈ చిన్న పని చేస్తే చాలు చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

2 Min read
Mahesh Rajamoni
Published : Sep 05 2022, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ రోజుల్లో చాలా చిన్న వయసు వారు కూడా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. కానీ ఈ వ్యాధి ఒకసారి సోకిందంటే ఇక మనం చనిపోయే దాకా మనతోనే ఉంటుంది. దీనికి మనం చేయాల్సిందల్లా నియంత్రణలో ఉంచుకోవడమే. డయాబెటీస్ అనేది ఇన్సులిన్ లోపం. ఈ ఇన్సులినే మనం తిన్న ఆహారాన్ని శక్తి మార్చుతుంది. ఇక ఇది లోపిస్తే..  మన రక్తంలో గ్లూకోజ్  దారుణంగా పెరుగుతుంది. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి కొంతమంది రెగ్యులర్ గా మెడిసిన్స్ ను తీసుకుంటూ ఉంటారు. 

27
walking

walking

అయితే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉంటూ.. ఒత్తిడికి లోనుకాకుండా ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఏవి పడితే అవి తింటే కూడా రక్తంలో విపరీతంగా చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అయితే తిన్న తర్వాత కొద్ది సేపు అటూ ఇటూ నడవడం వల్లా కూడా చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.  షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ తిన్న 10 నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాల పాటు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

37

సాధారణంగా మనం తినే ఆహారాల్లో కార్బోహైడ్రేట్లే ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఉపయోగం తక్కువ. అయితే ఇవి  షుగర్ పేషెంట్లకు ఏ మాత్రం మంచివి కావు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే శక్తి మన శరీరానికి ఏ విధంగానూ యూజ్ అవదు. అంతేకాదు ఇది ఒక్కోసారి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. 
 

47
walking

walking

అందుకే తిన్న తర్వాత మీరు ఖచ్చితంగా నడవండి. తేలిక పాటి వ్యాయామాలు చేసినా.. మన శరీంలో గ్లూకోజ్ వినియోగించబడుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

57

షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ముఖ్యంగా వీరి ఆరోగ్యానికి కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారం అస్సలు మంచిది కాదు. అలాగే స్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు కూడా షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి హానికరం. గ్లైసెమిక్ ఇండెక్స్ ద్రాక్ష, అరటిపండు, పుచ్చకాయలో ఎక్కువగా ఉంటుంది. 
 

67


ఇక కార్బోహైడ్రేట్లు బంగాళాదుంపల్లో, బియ్యంలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బ్రెడ్, కూల్ డ్రింక్స్ కూడా షుగర్ పేషెంట్లకు మంచివి కావు. అందుకే వీటిని వీరు తీసుకోకూడదు. 
 

77

మధుమేహులు షుగర్ తో చేని ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అయితే స్వీట్స్ మరీ ఇష్టం ఉంటే మీరు తినే వాటిలో కేలరీలు లేకుండా చూసుకోండి. స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ను కూడా మధుమేహులు తినకూడదు. రేగు పండ్లు, కివీలు షుగర్ పేషెంట్లకు చాలా మంచివి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
చేతుల అందాన్ని పెంచే బంగారు బ్రేస్లెట్స్.. లేటెస్ట్ డిజైన్లు ఇవిగో
Recommended image2
క్రిస్మస్ పండుగకు గిఫ్ట్ ఇవ్వడానికి ఈ మొక్కలు బెస్ట్ ఆప్షన్
Recommended image3
ఇవి తినడం మానేస్తే బరువు తగ్గడం చాలా ఈజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved