35 ఏండ్లు దాటిన వారికే కవల పిల్లలు పుడతారా?
పెళ్లైన ప్రతి స్త్రీ తమకు పండంటి మగ బిడ్డ లేదా ఆడబిడ్డ పుట్టాలని ఎన్నో దేవుళ్లను మొక్కుకుంటారు. కొంతమంది మహిళలైతే కవలలు పుట్టాలని కోరుకుంటుంటారు. అయితే కవలలు పుట్టాలంటే ఆ స్త్రీ వయస్సు 35 ఏండ్లు దాటాలని అంటుంటారు. 35 ఏండ్లు దాటితేనే ట్విన్స్ పుడతారా? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..

పెళ్లైన ప్రతి స్త్రీకి మొదటగా ఉండే కోరిక పండంటి బిడ్డకు జన్మనివ్వాలని. అందులో ఎంతో మంది మహిళలు తమకు కవల పిల్లలు పుట్టాలని ఎంతగానో కోరుకుంటారు. అయితే కవలలు పిల్లలు పుట్టాలంటే వారి వయస్సు ఖచ్చితంగా 35 ఏండ్లు దాటాలని చాలా మంది చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఇది ఎంతమాత్రం నిజం కాదని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఆడవారిలో 25 ఏండ్లు దాటిన తర్వాత వారిలో అండం నాణ్యత ( Egg quality)తగ్గుతుందట. అదే 30 సంవత్సరాలు దాటితే Egg quality ఇంకా ఎక్కువగా క్షీణిస్తుందట. ఇకపోతే 35 సంవత్సరాల తర్వాతే పిల్లలకోసం ప్లాన్ చేసుకుంటే మాత్రం పిల్లలు అనేక జన్యు లోపాలతో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు 35 ఏండ్లుల దాటిన తర్వాత కవల పిల్లలు పుట్టడం చాలా తక్కువని చెబుతున్నారు. దాదాపుగా 80 నుంచి 100 ప్రసవాలలో ఒకరో ఇద్దరో కవలలకు జన్మనిచ్చే అవకాశం ఉంటుందట.
అయితే చాలా మంది ఫెర్టిలిటీ సెంటర్ల ద్వారా చికిత్స తీసుకుని కవలలకు జన్మనిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల కూడా ప్రస్తుత రోజుల్లో కవలల సంఖ్య పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
కాగా సహజంగా కవలలు పుట్టాలంటే మాత్రం 35 ఏండ్ల లోపే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. కాగా Fertility Centers ద్వారా మాత్రమే కవలలు ఆ వయసులో పుడతారు. అలాగే ట్విన్స్ కోసం మెడిసిన్స్ ను కూడా ఉపయోగించవచ్చట. కానీ వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల Pre-term deliveries అధిక మొత్తంలో అవుతాయట. అంతేకాదు ఆ తల్లికి షుగర్, అనేమియా, బీపీ వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందట. కవలలు పుట్టినా వారి ఆరోగ్యం విషయంలో రిస్క్ ఎక్కువగా ఉంటుందట. కాబట్టి పిల్లలు ఒక్కరూ పుట్టినా ఆరోగ్యంగా ఉంటే చాలు. కవలలు కావాలని లైఫ్ ను రిస్క్ లో పెట్టొద్దని నిపుణులు పేర్కొంటున్నారు.