Fish Prasadam నిజంగా ఉబ్బసాన్ని తగ్గిస్తుందా..?..ఆస్తమా అసలు ఎందుకు వస్తుంది
ఆస్తమా లేదా ఉబ్బసం అనేది ఒక వ్యాధి. దీన్ని తగ్గించటానికి పలు రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ కొంతమంది చేప మందును బాగా విశ్వసిస్తుంటారు. మరి చేప మందు నిజంగానే ఈ జబ్బును తగ్గిస్తుందా? అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి
ఉబ్బసం లేదా ఆస్తమా, అనేది ఒక దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. దీన్ని బ్రోన్చియల్ ఆస్తమా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధిలో శ్వాసనాళాలు వాపునకు గురవుతాయి. ఈ వ్యాధి వంశపారపర్యంగానూ వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
కనిపించే ప్రధాన లక్షణాలు
ఛాతీ నొప్పి ,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,శ్వాస నాళాల వాపులు,రాత్రి పూట ఎక్కువగా దగ్గు రావడం, శ్వాస తీసేటప్పుడు ఈల లాంటి శబ్ధం రావడం
అసలు ఉబ్బసం వచ్చే కారణాలు ఏంటి...
వంశపారంపర్యంగా వచ్చే అవకాశం,పొల్యూషన్, ధూళి, పొగ, అలర్జీలు,శీతల వాతావరణం, గాలి మార్పులు, జబ్బులు (ఫ్లూ, జలుబు లాంటివి),మానసిక ఒత్తిడి లేదా భయం,చికిత్స & నివారణ
ఎవరికీ వస్తుంది?
దీనికి వయసుతో సంబంధం లేదు.చిన్న పిల్లల నుంచి పెద్ద వారు వరకు ఎవరికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతుంటే వారిలో 5 శాతం మంది చిన్నారులే ఉంటున్నారు. చిన్న వయసులోనే పిల్లలు ఈ వ్యాధి బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు
చికిత్స ద్వారా అదుపులో
ఇన్హేలర్లు ఉపయోగించడం,డాక్టర్ సూచించిన మందులు సమయానికి తీసుకోవడం,అలర్జీలు కలిగించే వస్తువుల నుండి దూరంగా ఉండటం,శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం
180 సంవత్సరాలుగా...
బత్తిన కుటుంబ సభ్యులు 180 సంవత్సరాలుగా ఉబ్బసానికి చేప మందును పంపిణీ చేస్తున్నారు.చేప ప్రసాదాన్ని ప్రతిఏటా 5 లక్షల మందికిపైగా తీసుకుంటారు. బత్తిన సోదరుల సమక్షంలో చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ చేపమందు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ నుంచి కూడా ఉబ్బస వ్యాధిగ్రస్తులు నగరానికి వస్తారు.