Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • మొటిమలు పోవడానికి శెనగపిండిని ఎలా ఉపయోగించాలో తెలుసా?

మొటిమలు పోవడానికి శెనగపిండిని ఎలా ఉపయోగించాలో తెలుసా?

ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు పోవడానికి రకరకాల క్రీములు, ఫేస్ ప్యాక్ లను ఉపయోగించేవారు చాలా మందే ఉన్నారు. క్రీమ్స్ కంటే నేచురల్ పద్దతులే మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి తెలుసా? 

Mahesh Rajamoni | Published : Aug 07 2023, 04:31 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

ఏమో అనుకుంటాం కానీ.. స్కిన్ కేర్ అంత సులువైన పనైతే కాదని అందరికీ తెలుసు.  చాలా మంది ముఖం అందంగా కనిపించాలని, మొటిమలు, నలుపు, మొటిమల మచ్చలు, తెల్లమచ్చలు పోవాలని ఏవేవో క్రీములను వాడుతుంటారు. ఇంకొందరు ఫేస్ ప్యాక్స్ ను వాడుతుంటారు. అన్నింటికంటే ముఖం సౌందర్యానికి నేచురల్ పద్దతులే బెస్ట్. ఎందుకంటే వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. చర్మం దెబ్బతినే అవకాశమే ఉండదు.  అందుకే ప్రస్తుతం చాలా మంది నేచురల్ పద్దతులనే ఫాలో అవుతున్నారు. 
 

25
Asianet Image

అయితే శెనగపిండిని అనాదిగా చర్మ సంరక్షణకు ఉపయోగిస్తూ వస్తున్నారు. చర్మంపై మొటిమలను తొలగించడానికి, చర్మానికి మంచి రంగును ఇవ్వడానికి శెనగపిండిని సాధారణంగా ఉపయోగిస్తారు. దీనిలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి చర్మాన్ని అందంగా మార్చుతుంది. మరి శెనగపిండి ప్యాక్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

35
Asianet Image

1. మూడు టేబుల్ స్పూన్ల శెనగపిండిని తీసుకుని అందులో చిటికెడు పసుపును, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్,  కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి పేస్ట్ లా తయారుచేయండి. దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఈ ప్యాక్ మీ చర్మం అందంగా మెరిసేందుకు సహాయపడుతుంది.
 

45
besan

besan

2. ఒక చెంచా బియ్యప్పిండిని తీసుకుని అందులో ఒక చెంచా శెనగపిండిని, కొద్దిగా తేనెను వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ తో ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయొచ్చు.

55
Asianet Image

3. మూడు టీస్పూన్ల శెనగపిండిలో 15.20 టీస్పూన్ల ఓట్ మీల్ పౌడర్ ను, పెరుగును వేసి కలిపి ప్యాక్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేసుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేయాలి. ఈ ప్యాక్ మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
సౌందర్యం
 
Recommended Stories
Top Stories