భూమి ఎప్పుడు అంతం కానుంది.? లెక్కలు వేసి మరీ చెప్పిన శాస్త్రవేత్తలు
Earth End: యుగాంతం.. ఈ అంశం ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్పై వచ్చిన హాలీవుడ్ చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. అయితే నిజంగా మన భూమి ఎప్పుడు అంతం కానుందన్న విషయాన్ని పరిశోధకులు చెప్పేశారు.

శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే.?
నాసా శాస్త్రవేత్తలు, జపాన్లోని టోహో విశ్వవిద్యాలయ పరిశోధకులు కలిసి ఒక పెద్ద సూపర్ కంప్యూటర్ ద్వారా లెక్కలు వేశారు. ఆ లెక్కలు చెబుతున్న వివరాల ప్రకారం.. మన భూమి ఎప్పటికీ ఇలాగే ఉండదు. సూర్యుడు కొద్దికొద్దిగా వేడిగా, ప్రకాశంగా మారుతున్నందున భూమిపై జీవం ఉండే పరిస్థితులు చాలా సంవత్సరాల తర్వాత మారిపోతాయి.
భూమి ఎప్పుడు నివసించలేని స్థితికి చేరుతుంది?
నాసా లెక్కల ప్రకారం, ఇంకా సుమారు 1 బిలియన్ (100 కోట్ల) సంవత్సరాల తర్వాత భూమి మీద మనుషులు, జంతువులు, మొక్కలు ఉండడం కష్టం అవుతుంది. అప్పటికి సూర్యుడు చాలా వేడిగా మారి, భూమి మీద ఉష్ణోగ్రతలు భరించలేనంతగా పెరుగుతాయి.
భూమి మీద ఏ మార్పులు వస్తాయి?
* సూర్యుడి వేడి వల్ల భూమి చాలా వేడెక్కుతుంది.
* సముద్రాలు క్రమంగా ఆవిరైపోతాయి, నీరు తగ్గిపోతుంది.
* గాలిలో ఆక్సిజన్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి.
* భూమి పొడి, ఎండిపోయిన రాతిబండలా మారుతుంది.
* భూమిపై ఉష్ణోగ్రత 100°C వరకు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ జీవి కూడా ఎక్కువసేపు బతకలేదు.
చివరికి సూర్యుడు ఏం చేస్తాడు?
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడు “ఎర్ర దిగ్గజం” (Red Giant) గా మారుతాడు. అప్పుడు అది పెద్దదై భూమికి దగ్గరగా వస్తుంది. ఆ సమయంలో సూర్యుడి వేడి, కాంతి అంత ఎక్కువ అవుతుంది. భూమి మొత్తం కాలిపోవచ్చు లేదా సూర్యుడిలో కలిసిపోవచ్చు. అదే భూమి చివరి దశ అవుతుంది.
ఏం చేయాలి?
ఇవి చాలా దూర భవిష్యత్తులో జరిగే విషయాలు. కానీ నాసా చెప్పిన ఈ లెక్కలు మనకు ఒక హెచ్చరిక. ఇప్పుడే మనం కాలుష్యం తగ్గించకపోతే, వాతావరణ మార్పులు (climate change) వల్ల భూమి పరిస్థితి మరింత వేగంగా చెడిపోతుంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే.. పెద్ద ఎత్తున చెట్లను నాటాలి, నీటిని వృధా చేయకూడదు, కాలుష్యాన్ని తగ్గించాలి, ప్రకృతిని కాపాడాలని నిపుణులు చెబుతున్నారు.