కిడ్నాప్తో సంబంధం లేదు, ఫేక్ డైమండ్ రింగ్ ఇచ్చాడు: చోక్సీ గర్ల్ఫ్రెండ్ బార్బరా సంచలనం
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మొహల్ చోక్సీ విషయంలో ఆయన గర్ల్ ఫ్రెండ్ బార్బరా కీలక విషయాలను వెల్లడించారు. చోక్సీ చెబుతున్న విషయాలను ఆమె కొట్ిపారేశారు.
మెహల్ చోక్సీ కిడ్నాప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన గర్లఫ్రెండ్ బార్బరా తెలిపారు.పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చోక్సీ ఇటీవల కిడ్నాప్ గురయ్యాడు
ఇదంతా డ్రామా అని తర్వాత తేలింది. అయితే తాను కిడ్నాప్ కావడానికి బార్బరా కారణమని ఆయన ఆరోపించాడు. ఈ విషయమై బార్బరా స్పందించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చోక్సీ కోసం సీబీఐ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విదేశాల్లో ఉంటున్న చోక్సీని ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇండియాకు రాకుండా తప్పించుకొనేందుకు ఈ కిడ్నాప్ డ్రామా ఆడారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సమయంలోనే బార్బరా కిడ్నాప్ పై స్పందించింది.
రాజ్ పేరుతో చోక్సీ తనకు పరిచయమయ్యాడని ఆమె చెప్పారు. తనకు ఆయన మంచి ఫ్రెండ్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. గత ఏడాది ఆగష్టు మాసం నుండి చోక్సీతో తనకు పరిచయం ఉందని ఆమె వివరించారు.
తనకు ఫేక్ డైమండ్ రింగ్ ఇచ్చాడని చోక్సీ గురించి ఆమె తెలిపింది. కరేబీయన్ దీవుల్లో స్థిరపడాలని తనకు ఉందని ఆయన తనకు చెప్పాడని తెలిపింది
త్వరలోనే క్యూబాలో స్థిరపడాలని ఆయన భావించాడని ఆమె చెప్పారు. తనతో కలిసి వ్యాపారం చేద్దామని చోక్సీ తనతో ప్రతిపాదన చేశాడని ఆమె వివరించారు
మే 23వ తేదీన అంటిగ్వాలో చోక్సీ అదృశ్యమైడొమినికాలో ప్రత్యక్షమైన సమయంలో తాను అంటిగ్వాలో లేనని ఆమె స్పష్టం చేశారు. చోక్సీ కిడ్నాప్ తో తనకు సంబంధం లేదని తెలిపారు.
ఈ విషయమై మీడియా ద్వారా తాను చాలా చెత్త, ఆసక్తికకరమైన వార్తలను వింటున్నట్టుగా ఆమె చెప్పారు.
చోక్సీ తన కోసం చాలాసార్లు హోటల్ గదులను బుక్ చేసేందుకు ముందుకు వచ్చారన్నారు.విమాన టికెట్లను కూడ ఇచ్చేందుకు ముందుకు వచ్చారని బార్బరా చెప్పారు. అయితే తమ మధ్య స్నేహం మాత్రమే తాను కోరుకొన్నానని చెప్పారు.