అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: ట్రంప్ ఓటమిలో పెన్సిల్వేనియా కీలకం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్నకు పెన్సిల్వేనియా రాష్ట్రంలో కీలకమైన ఓట్లు దక్కలేదు. ఈ ఎన్నికల్లో బైడెన్ కు ఈ రాష్ట్రంలో ఓటర్లు మద్దతుగా నిలిచారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమికి పలు రకాల కారణాలను విశ్లేషిస్తున్నారు విశ్లేషకులు. అయితే ఈ ఓటమికి ట్రంప్ నోటి దురుసుతనం కూడ కారణమనే అభిప్రాయాలను కూడ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు అమెరికా అధ్యక్ష ఫలితాన్ని శాసించాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడేల్ఫియా కౌంటిలో దాదాపుగా 15 లక్షల మంది నివాసం ఉంటున్నారు.
వీరిలో 7.5 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.సుమారు 81 శాతం మంది బైడెన్ కు అనుకూలంగా ఓటేశారు.ఈ రాష్ట్రంలో బైడెన్ కు 20 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు దక్కాయి. దీంతో ట్రంప్ ఈ ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.
బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి ఈ రాష్ట్రం పేరొందింది. ఈ ఉద్యమంలో 43 శాతం మంది ఆఫ్రో అమెరికన్లు, 45 శాతం శ్వేతజాతీయులు పాల్గొన్నారు. ఈ ఉద్యమాన్ని ట్రంప్ అవమానపర్చేలా మాట్లాడారు. ఈ మాటలు ట్రంప్ ఈ రాష్ట్ర ప్రజలు ఓటు రూపంలో చెప్పారు. బైడెన్ కు అనుకూలంగా ఓటేసి ట్రంప్ పై తమ కసిని తీర్చుకొన్నారు.
జార్జియాలోని అట్లాంటాలోని 5 డిస్టిక్ట్ లో ఆఫ్రో అమెరికన్లు అత్యధికంగా ఉంటారు. జాన్ లూయిస్ డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహించిన జాన్ లూయిస్ ఈ ఏడాది జూలైలో మరణించాడు.
అంత్యక్రియల్లో ట్రంప్ పాల్గొనకపోవడం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో క్లే టౌన్ కౌంటీలో బైడెన్ కి అత్యధికంగా ఓట్లు పడ్డాయి. డెకాల్స్ కౌంటీ, జార్జియాలో 30 శాతం ఓటర్లు బైడెన్ కు మద్దతిచ్చినట్టుగా ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి.